22 June, 2026 | 2:27 PM

Breaking News

ఉప సర్పంచుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా..   •   శిక్షణా తరగతులు కార్మిక చైతన్యానికి దోహదపడాలి   •   ​ ప్రజా పాలన సినిమా కాదు.. ప్రతిపక్ష పాత్ర సరిగ్గా పోషించండి: మంత్రి సీతక్క   •   డీటీవో వెంకన్న మృతి పట్ల రేవంత్ రెడ్డి దిగ్బ్రాంతి   •   రాజ్‌నాథ్‌ సింగ్‌తో CM రేవంత్ రెడ్డి భేటీ.. కీలక అంశాలపై చర్చ!   •   తరగతి గదుల్లోకి ఉపాధ్యాయుల వాహనాలు.!   •   ఎం.జి.ఎన్.ఆర్.ఈ.జి.ఎస్ నిధులతో రూ.27 లక్షల పనులకు శంకుస్థాపన   •   విద్యార్థుల్లో యోగా ప్రతిరోజు దినచర్య కావాలి   •   సంధ్య థియేటర్ తొక్కిసలాట: కోర్టుకు హాజరుకాని అల్లు అర్జున్   •   దేశానికి చక్రవర్తులమనే భావనలో మోదీ, అమిత్ షా   •  

గుడుంబా అమ్ముతున్న వారిపై పోలీసులు కన్నెర్ర

24-07-2025 08:52 PM

తహశీల్దార్ ముందు ఆరుగురుని బైండోవర్ చేసిన పోలీసులు..

కన్నాయిగూడెం (విజయక్రాంతి): ములుగు జిల్లా(Mulugu District) కన్నాయిగూడెం మండలంలోని గుడుంబా తయారీ విక్రయంపై పోలీసులు కన్నెర్ర చేశారు. ఈ క్రమంలో బుట్టాయిగూడెం గ్రామానికి చెందిన కుమ్మరి నారాయణ, సునార్కని సత్యం, సుధాకర్, సంతోష్, దుర్గం మహేందర్, అసరెల్లి రవిలపై గురువారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెంకటేష్(SI Venkatesh) తెలిపారు. ఈ సందర్భంలో ఎస్సై వెంకటేష్ మాట్లాడుతూ, వీరు రోజువారీగా గుడుంబా సరఫరా చేస్తున్నారని, ఈ నిందితులను మండల తహసీల్దార్ ఎదుట హాజరుపరిచామని భవిష్యత్తులో మళ్లీ ఇలాంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే 6 నెలల జైలు శిక్షతో పాటు లక్ష రూపాయల వరకు జరిమానా విధించేలా బైండోవర్ పత్రాలు తహశీల్దార్ కి సమర్పించామని తెలిపారు. నిందితులను మంచి ప్రవర్తన కోసమని తహశీల్దార్ ముందు బైండోవర్ చేసినట్లు అన్నారు.