24-09-2025 06:38:25 PM
బెజ్జూర్,(విజయక్రాంతి): దహెగాం మండలంలోని మర్రిపల్లి, దేవులగూడ, కల్వడ గ్రామాల్లో దాడులు నిర్వహించి 12 లీటర్ల నాటుసారాయిని, 10కిలోల పటికని స్వాధీన పరచుకుని, మర్రిపల్లి కి చెందిన బాదవత్ రాజేందర్, దరావత్ వందనల కేసులు నమోదు చేసి నాటు సారాయి, గంజాయి, మత్తు పదార్ధాల వలన కలిగె దృష్ప్రభావాల గురించి అవగాహన సదస్సు నిర్వహించినట్టు కాగజనగర్ ఎక్సైజ్ సీఐ రవి తెలిపారు. ఈ దాడులలో ఆదిలాబాద్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సిఐ అక్బర్ హుస్సేన్, ఎస్సైలు పి.లోభానంద్, ఐ.సురేష్, సిబ్బంది పాల్గొన్నట్టు తెలిపారు.