14 July, 2026 | 11:20 AM

Breaking News

విద్యార్థుల హక్కుల కోసం పోరాడితే అక్రమ అరెస్టులా?   •   తగ్గిన రూపాయి విలువ.. నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు   •   కనుగుట్ట శబరిమాత ఆశ్రమానికి నిధుల మంజూరుకి హామీ   •   గ్రామాల అభివృద్ధిలో వార్డు సభ్యులది కీలక పాత్ర   •   చలో సచివాలయం నేపథ్యంలో సీపీఎం నాయకుల అరెస్ట్   •   Strait of Hormuz Crisis: ఇరాన్ ఓడరేవులపై అమెరికా ఆంక్షలు.. ట్రంప్ హెచ్చరికలకు ఇరాన్ కౌంటర్ వార్నింగ్   •   CM Revanth Reddy Delhi Tour: కేంద్ర మంత్రులతో కీలక భేటీలు.. తెలంగాణ ప్రాజెక్టులపై నేడు కీలక చర్చలు   •   జోగులాంబ క్షేత్రంలో భక్తి వైభవం   •   సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా ప్రభుత్వ పాలన   •   వనపర్తి అభివృద్ధే మా లక్ష్యం.. ప్రజల తీర్పే కాంగ్రెస్‌కు బలం   •  

అంకిత భావంతో పనిచేసి నిర్దేశిత లక్ష్యాలను సాధించాలి

11-09-2025 06:46 PM

సింగరేణి డైరెక్టర్(పిపి) వెంకటేశ్వర్లు..

మందమర్రి (విజయక్రాంతి): సింగరేణి ఉద్యోగులు అధికారులు సమిష్టిగా కృషిచేసి అంకితభావంతో విధులు నిర్వహించడం ద్వారా నిర్దేశిత ఉత్పత్తి లక్ష్యాలను చేరుకోవడం  సాధ్యమవుతుందని సింగరేణి డైరెక్టర్ ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్ వెంకటేశ్వర్లు(Singareni Director (PP) Venkateshwarlu) అన్నారు. ఏరియా జీఎం కార్యాలయంలో బుధవారం ఉత్పాదకతపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను సాధించేందుకు చేపట్టాల్సిన చర్యలను అధికారులతో చర్చించారు. అనంతరం ఏరియాలోని కేకే ఓసీపీ, పిఓబి ప్లాంటును సందర్శించారు. ఓసిపిలో బొగ్గు ఉత్పత్తి ఉత్పాదకత పెంపొందించేందుకు తీసుకోవాల్సిన చర్యలను అధికారులకు సూచించారు. వర్షాకాలంలో బొగ్గు ఉత్పత్తికి విఘాతం కలగకుండా తగు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు తెలిపారు. కేకే ఓసీలో ప్రారంభానికి సిద్ధంగా ఉన్న పిఓబి ప్లాంట్ పనుల యొక్క వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏరియా జిఎం ఎన్ రాధాకృష్ణ, ఎస్ఓటు జిఎం విజయ ప్రసాద్, కెకె ఓసి ప్రాజెక్ట్ ఆఫీసర్ మల్లయ్య, పర్సనల్ మేనేజర్ శ్యామ్ సుందర్, గని మేనేజర్ రామరాజు, సీనియర్ సెక్యూరిటీ ఆఫీసర్ రవి, ఏరియా సీనియర్ అధికారులు  పాల్గొన్నారు.