calender_icon.png 12 October, 2025 | 11:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రామ ప్రజలకు జాగ్రత్తల సూచనలు

12-10-2025 07:59:15 PM

నిర్మల్ (విజయక్రాంతి): కుభీర్ మండలంలోని పార్డి(కె) గ్రామంలో ఈ రోజు స్థానిక ఎస్ఐ కృష్ణ రెడ్డి గ్రామ ప్రజలతో సమావేశమై పలు ముఖ్యమైన సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ కృష్ణ రెడ్డి ప్రజలకు తెలియజేసిన అంశాలు:

• ప్రస్తుతం పంటల కోత సమయం కావున రోడ్లపై పంటలు వేసి ఎండబెట్టరాదు. రోడ్లపై పంటలు వేయడం వల్ల ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని హెచ్చరించారు.

• సైబర్ నేరగాళ్లు ఇటీవల APK ఫైల్స్, అనుమానాస్పద లింక్స్ పంపుతూ మోసాలు చేస్తున్నారు. తెలియని లింక్స్ ఓపెన్ చేయరాదు, APK ఫైల్స్ డౌన్‌లోడ్ చేయరాదని చెప్పారు.

• పంటలను అమ్మేటప్పుడు నమ్మకస్తులకే అమ్మాలని, మోసపోకుండా జాగ్రత్త వహించాలని సూచించారు.

• ప్రయాణించే ప్రతి ఒక్కరు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, రోడ్డు భద్రతను పాటించాలని అన్నారు.

ఎస్ఐ కృష్ణ రెడ్డి ప్రజల భద్రత, సైబర్ జాగ్రత్తలు, ఆర్థిక రక్షణపై అవగాహన కల్పించారు. గ్రామ ప్రజలు ఈ సూచనలను గమనించి పాటించాలని పిలుపునిచ్చారు.