19-06-2025 12:38:39 AM
గ్రామీణ ప్రాంతాలను కలుపుతూ నూతన ఆర్టీసీ రూట్లను ప్రతిపాదించాలి
మహిళల ఉచిత బస్సు ప్రయాణం కొరకు ఆర్టీసీకు రూ.6210 కోట్ల చెల్లింపు
మధిర పట్టణంలో ౧0 కోట్ల రూపాయలతో చేపట్టిన నూతన బస్ స్టాండ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన భట్టి
మధిర, జూన్ 18. (విజయ క్రాంతి): ఊరి కో బస్సు... ఇంటికో దీపం అనే నినాదంతో పని చేస్తున్నామని డిప్యూటీ సి.ఎం. భట్టి విక్రమార్క మల్లు అన్నారు. బుధవారం రాష్ట్ర డిప్యూటీ సీఎం, ఆర్థిక, ఇంధన శాఖల మం త్రి భట్టి విక్రమార్క మల్లు మధిర పట్టణం లో 10 కోట్ల రూపాయలతో చేపట్టిన బస్ స్టాండ్ నిర్మాణ పనులకు, రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్, జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టిలతో కలిసి శంకుస్థాపన చేశారు.
ఈ సం దర్భంగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ 1987 లో మొదలైన మధిర డిపో అంచెలంచెలుగా ఎ దిగిందని అన్నారు. 1978 లో మర్రి చెన్నారెడ్డి నాయకత్వంలో ఊరికి ఒక బస్సు ఇం టికి ఒక దీపం అనే స్లోగన్ తో ప్రభుత్వం ఏ ర్పాటు జరిగిందని అన్నారు. కార్యక్రమంలో రవాణ, బీసీ సంక్షేమ శాఖల మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ 1987 లో 4 బస్సులతోప్రారంభమైనమధిర బస్ స్టాండ్ నేడు 70 బస్సుల స్థాయికి చేరిందన్నారు.
ప్రజా ప్రభుత్వం ఏర్పడిన 48 గంటలలోగా మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించిందని అన్నారు. అనంతరం డిప్యూటి సీఎం, మంత్రులు బస్సులను ప్రారంభించి ప్రయాణికుల సీట్లలో కూర్చొనీ కొద్ది దూరం ప్ర యాణించారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ చైర్మన్లు రాయల నాగేశ్వరరావు, నాయు డు సత్యనారాయణ, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ నరసింహరావు, కరీంనగర్ జోన్ టిజిఎస్ ఆర్టిసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పగిడిమర్రి సోలోమన్, ఆర్టీసీ ఇంజనీరింగ్ అసెట్ మేనేజ్మెంట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చెరుకుపల్లి వెంక న్న, ఆర్టీసీ ఖమ్మం రీజినల్ మేనేజర్ అజ్మీరా సరిరాం, ఆర్టీసీ చీఫ్ సివిల్ ఇంజనీర్ జోగు భాస్కర్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.