15 June, 2026 | 10:00 PM

Breaking News

భారీ ఈదురుగాలులకు పారాబాయిల్డ్ రైస్ మిల్ ధ్వంసం   •   చిన్నారి పిల్లల రక్షణ కే బేబీ కేర్: ఎంపీ గోడం నగేష్   •   250 గ్రాముల గంజాయితో యువకుడు అరెస్ట్   •   వడ్డెర సంఘం అధ్యక్షుడిగా కొమ్మరాజుల సురేష్   •   ఆటోను ఢీకొట్టిన ఇసుక లారీ   •   నకిలీ విత్తనాల దందాను అడ్డుకున్నందుకే హత్యాయత్నం..?   •   పెద్దపల్లి జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా జడల సురేందర్ ఏకగ్రీవం   •   కామారెడ్డి జిల్లాలో బీఎల్ఏ, సర్ మ్యాపింగ్ 90 శాతం పూర్తి   •   ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యం: కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •   ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పెంచాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా   •  

ప్రైవేట్ కాలేజీల బంద్ 23 వరకు వాయిదా

09-10-2025 01:48 AM
  1. దీపావళి వరకు రూ.300 కోట్లు ఇస్తామని ప్రభుత్వం హామీ
  2. అప్పటికీ బకాయిలు విడుదల చేయకుంటే భవిష్యత్ కార్యాచరణ
  3. ప్రకటించిన ప్రైవేట్ విద్యాసంస్థల సమాఖ్య

హైదరాబాద్, అక్టోబర్ 8 (విజయక్రాంతి): ప్రైవేట్ ఇంజినీరింగ్‌తో సహా వృత్తి విద్యా కళాశాలన్నీ 13 నుంచి తలపెట్టిన సమ్మె, కాలేజీల బంద్‌ను వాయిదావేస్తున్నట్లు ప్రైవేట్ విద్యాసంస్థల సమాఖ్య (ఫతి) బుధవారం ప్రకటించింది. మంగళవారం సీఎం రేవంత్ రెడ్డి సలహాదారు వేం నరేంద ర్ రెడ్డితో ‘ఫతి’ కమిటీ సభ్యులు పెం డింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై జరిపిన చర్చలు సఫలమైన ట్లు వారు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.

కాలేజీల సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి ఈ దీపావళి నాటికి ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల్లో కనీసం రూ.300 కోట్లు విడుదల చేసేలా తాను ప్రయత్నం చేస్తానని ఆయన హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. అయితే అప్పటివరకు సమ్మెకు వెళ్ల కుండా ఆగాలని ‘ఫతి’ సభ్యులను ఆయన కోరినట్లు పేర్కొన్నారు. దీనితో ఈనెల 23వ తేదీ వరకు కాలేజీల సమ్మె, బంద్ కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

ఒకవేళ ప్రభుత్వం దీపావళి నాటికి బకాయిలు విడుదల చేయకుంటే 23న తాము సమావేశం నిర్వహించి తదుపరి కార్యాచరణను ప్రకటిస్తామని పేర్కొ న్నారు. దసరాకు కొన్ని కాలేజీలకు రూ. 200 కోట్లను ప్రభుత్వం విడుదల చేయ గా, మరికొన్ని కాలేజీలకు ఒక్క రూపాయి కూడా విడుదల కాలేదని పేర్కొన్నారు.