7 April, 2026 | 3:25 PM

Breaking News

రేపే ఎన్ఎస్ఎస్ రాష్ట్ర స్థాయి సెమినార్   •   అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్న రేవంత్ రెడ్డి సర్కార్   •   సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే   •   కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన కోవ లక్ష్మి   •   ప్రజలు మధ్యవర్తులను నమ్మవద్దు   •   కన్నాలలో బాలామృతం కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్ గుడిసె గట్టయ్య   •   కేంద్రం కీలక నిర్ణయం.. 5 కిలోల గ్యాస్‌ సిలిండర్ల సరఫరా పెంపు   •   నల్గొండ జిల్లాలో ఘోరప్రమాదం: విద్యుత్ స్తంభాల ట్రాక్టర్ బోల్తా— ఇద్దరు మృతి   •   హైదరాబాద్‌లో కలకలం... కూకట్‌పల్లి JNTUకు బాంబు బెదిరింపు   •   పెద్దపల్లి నియోజకవర్గంలో రైతులే రాజులు   •  

12న పల్స్ పోలియో వ్యాక్సినేషన్

09-10-2025 12:45 AM

రాష్ట్రంలోని 6 జిల్లాల్లో స్పెషల్ డ్రైవ్

హైదరాబాద్, అక్టోబర్ 8 (విజయక్రాంతి): ఈ నెల 12న రాష్ర్టంలోని 6 జిల్లాల్లో పల్స్ పోలియో వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్‌ను నిర్వహించాలని వైద్యారోగ్య శాఖ అధికారులు నిర్ణయించారు. రాష్ర్టంలో పోలియో చివరి కేసు 2007లో, దేశంలో 2011లో నమోదయ్యింది. మూడేండ్లుగా బంగ్లాదేశ్, పాకిస్థాన్ తదితర దేశాల్లో పోలియో కేసులు నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా దేశాల నుంచి భారత్‌కు రాకపోకలు జరుగుతున్న జిల్లాల్లో పోలియో వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని కేంద్ర ఆరోగ్యశాఖ నిర్ణయించింది.

ఇందుకోసం దేశవ్యాప్తంగా 290 జిల్లాలను ఎంపిక చేయగా, ఇందులో మన రాష్ర్టం నుంచి హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, హనుమకొండ ఉన్నాయి. ఈ ఐదు జిల్లాలతోపాటు వరంగల్ జిల్లా పరిధిలోని పట్టణ ప్రాంతంలోనూ వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని ఆరోగ్యశాఖ నిర్ణయించింది. ఈ 6 జిల్లాల పరిధిలో ఐదేండ్లలోపు పిల్లలు 17,56,789 మంది ఉన్నట్టు అధికారులు అంచనా వేశారు.