calender_icon.png 28 October, 2025 | 7:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రూ. 450 కోట్ల అభివృద్ధి పనుల ప్రొసీడింగ్స్ ప్రజలకు బహిర్గతం చేయాలి..

28-10-2025 05:14:41 PM

మొరం, ఇసుక అమ్ముకుంటున్న ఎమ్మెల్యే అనుచరులు 

ఇచ్చిన హామీల్లో బస్సు డిపో, ఇంజనీరింగ్, బీ ఈ డీ కళాశాలలేవీ 

బీఆర్ఎస్వి జిల్లా అధ్యక్షుడు బడికల శ్రావణ్

బెల్లంపల్లి అర్బన్: కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ 22 నెలల్లో బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ధికి రూ.450 కోట్ల నిధులు ఎమ్మెల్యే గడ్డం వినోద్ తెచ్చారని కాంగ్రెస్ నాయకులు చెప్పడం అర్థరహితమని బీఆర్ఎస్వి జిల్లా అధ్యక్షుడు బడికల శ్రావన్ పేర్కొన్నారు. బెల్లంపల్లి ప్రెస్ క్లబ్ లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గత బీఆర్ఎస్ పార్టీ హయాంలో నాటి ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యలు తెచ్చిన అభివృద్ధి పనుల ప్రొసీడింగ్స్ ల  పనులు, పేర్లు ఎమ్మెల్యే వినోద్ మార్పించారాని ఆయన ఆరోపించారు. ఎమ్మెల్యే వినోద్ స్వంతంగా రూ.450 కోట్ల నిధులు నియోజకవర్గ అభివృద్ధికి తీసుకువచ్చినట్లు తప్పుడు ప్రచారం చేయడం కాంగ్రెస్ నాయకుల నీతిమాలిన చర్యని ఆయన విమర్శించారు.

చేపట్టిన పనులను ఎమ్మెల్యే అనుచరులు పంచుకుని 5 నుంచి 10 శాతం కమిషండ్లకు కాంట్రాక్టర్లను, అధికారులను వేదిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఎమ్మెల్యే గా గెలిచాక బెల్లంపల్లి లో ఇంజనీరింగ్, బీఈడీ, మండలానికో జూనియర్ కళాశాల, ఆర్టీసీ బస్సు డిపో ఏర్పాటు చేస్తానని ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఇప్పటికీ వాటి ఊసెత్తక పోవడం సిగ్గు చేటన్నారు. సీ ఎస్ ఆర్, స్పెషల్ డెవలప్ మెంట్, నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే ఎన్ని నిధులు తెచ్చారో శ్వేత పత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే అనుచరులు ఆయన పేరుచెప్పి అధికారులను బెదిరిస్తూ ఇసుక, మొరం, అమ్ముకుంటున్నారని ఆయన ఆరోపించారు.

పెద్దబుగ్గ రోడ్డు ఎమ్మెల్యేనే వేయించారాని గొప్పలు చెప్పడం సరికాదని, 2018లో నాటి అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి రూ. 3 కోట్లు మంజూరు చేయించారని, ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రహించాలని హితవు పలికారు. బుగ్గ రోడ్డుకు ఎమ్మెల్యే వినోద్ కేవలం అటవిశాఖ క్లియరెన్స్ మాత్రమే తెచ్చారన్నారు. ఇప్పటి టికైనా ఎమ్మెల్యే తాను నియోజక వర్గ అభివృద్ధికి తెచ్చిన నిధులెన్నో శ్వేత పత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే చేసిన అభివృద్ధి ఏంటో వతేల్చు కునేందుకు బెల్లంపల్లి పోచమ్మ గుడివద్ద భహిరంగ చర్చకు సిద్ధమా? అని ఆయన కాంగ్రస్ నాయకులను ప్రశ్నించారు. బీఆర్ఎస్, బీఆర్ఎస్ నాయకుల జోలికి కాంగ్రెస్ నేతలు వస్తే ఊరుకునేది లేదని కాంగ్రెస్ నేతల ఇళ్ల ముందు ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఆయన హెచ్చరించారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ యూత్ నాయకులు బుద్దార్తి సుమన్, అంగూరి విజయ్, మద్దెల సాయి తదితరులు పాల్గొన్నారు.