9 May, 2026 | 9:53 PM

Breaking News

దేవునితండాలో గాలివాన భీభత్సం   •   మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా శ్రీరామ్ వెంకటేష్ పునర్నియామకం   •   నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించిన దేవస్థానం   •   రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ మృతి   •   ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును ఢీకొన్న ఇసుక టిప్పర్   •   సిర్గాపూర్‌లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే   •   రోడ్లపై ధాన్యం వేస్తే కఠిన చర్యలు తప్పవు: డిఎస్పి వెంకట్ రెడ్డి   •   ధాన్యం కొనుగోలు, రైతు నమోదు ప్రక్రియలపై దృష్టి సారించాలి   •   ఘనంగా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ వివాహ వార్షికోత్సవ వేడుకలు   •   అంకితభావంతో పనిచేస్తున్న నాయకులకే నామినేటెడ్ పదవులు - ఎమ్మెల్యే జారె   •  

ఉద్యమకారులకిచ్చిన హామీలు నెరవేర్చాలి

01-07-2025 12:47 AM

మహబూబాబాద్, జూన్ 30 (విజయ క్రాంతి): తెలంగాణ ఉద్యమకారులకు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం మండల అధ్యక్షుడు చాగంటి కిషన్ డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలను నెరవేర్చాలని కోరుతూ అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మలిదశ ఉద్యమంలో తెలంగాణ ఆకాంక్ష నెరవేర్చడానికి అనేక విధాలుగా ఉద్యమించినట్లు చెప్పారు.

స్వరాష్ట్ర కలను నెరవేర్చుకున్న సమయంలో ఉద్యమకారులకు తగిన గుర్తింపు లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.  పూర్వ జాక్ కన్వీనర్ మోడెమ్ రవిధర్ గౌడ్, పూర్వ విద్యార్ధి యువజన జాక్ కన్వీనర్ దండుశ్రీనివాస్, బాలమోహన్, సోమరాపు వెంకటయ్య, చిట్యాల వీరన్న, గాండ్ల మాలెందర్, కళాకారుడు వంగాల అశోక్, జనిగాలా పరమేష్, వేం వేంకట్ రెడ్డి, కీర్దీ సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.