9 May, 2026 | 10:41 PM

Breaking News

దేవునితండాలో గాలివాన భీభత్సం   •   మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా శ్రీరామ్ వెంకటేష్ పునర్నియామకం   •   నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించిన దేవస్థానం   •   రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ మృతి   •   ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును ఢీకొన్న ఇసుక టిప్పర్   •   సిర్గాపూర్‌లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే   •   రోడ్లపై ధాన్యం వేస్తే కఠిన చర్యలు తప్పవు: డిఎస్పి వెంకట్ రెడ్డి   •   ధాన్యం కొనుగోలు, రైతు నమోదు ప్రక్రియలపై దృష్టి సారించాలి   •   ఘనంగా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ వివాహ వార్షికోత్సవ వేడుకలు   •   అంకితభావంతో పనిచేస్తున్న నాయకులకే నామినేటెడ్ పదవులు - ఎమ్మెల్యే జారె   •  

ప్రజావాణి ఫిర్యాదులపై అలసత్వం వద్దు

01-07-2025 12:46 AM

జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్ 

రంగారెడ్డి, జూన్ 30( విజయక్రాంతి): రంగారెడ్డి కలెక్టరేట్ సముదాయ ఆవరణలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి (73 ) ఫిర్యాదులు అందినట్లు జిల్లా అదనపు కలెక్టర్ ప్రతీమా సింగ్ అధికారులను ఆదేశించారు. ప్రజావాణి లో వచ్చిన దరఖాస్తులను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు.జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో ని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి జిల్లా రెవెన్యూ అధికారి సంగీతతో కలసి ఆర్జీలను స్వీకరించారు.

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి తమ సమస్యల పరిష్కారానికై ప్రజలు అందించే వినతులను సంబంధిత శాఖల జిల్లా అధికారులు తక్షణమే స్పందిస్తూ పరిష్కరించాలని ఆదేశించారు. అర్జీలను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ పరిష్కరించాలని అధికారులను ఆమె ఆదేశించారు.రెవెన్యూ శాఖ నుంచి 32, ఇతర శాఖలకు నుంచి 41, మొత్తం 73 దరఖస్తులుఅందాయి.