17 July, 2026 | 2:30 PM

Breaking News

మొక్కులు చెల్లించుకున్న మాజీ మంత్రి   •   స్కూల్ వ్యాన్‌ను ఢీకొట్టిన రైలు.. ముగ్గురు విద్యార్థులు మృతి   •   నందిపేట తహసీల్దార్ సస్పెండ్   •   పామ్ ఆయిల్ కర్మాగారంలో ప్రమాదం.. ఇద్దరికీ తీవ్రగాయాలు   •   కొండపోచమ్మ రిజర్వాయర్ వద్ద బీఆర్ఎస్ నిరసన   •   వీఓ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి   •   రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉండాలి: ఎమ్మెల్యే పల్లా   •   ఆధిపత్య పోరు! విద్యార్థులు నిల్... డ్యూటీలో ఉపాధ్యాయులు   •   ప్రభుత్వ పాఠశాలల్లో నిర్లక్ష్యానికి తావులేదు: కలెక్టర్ సీరియస్   •   హైడ్రోజన్ రైలు.. సరికొత్త విప్లవానికి నాంది   •  

ఔటర్ పై వరుసగా 9 కార్లు ఢీ

01-07-2025 03:01 AM

 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ 

రాజేంద్రనగర్, జూన్ 30: ఔటర్ రింగ్ రోడ్డుపై వరుసగా 9 కార్లు ఢీకొన్నాయి. ఈ ఘటన ఆదివారం రాత్రి ఆర్‌జిఐఏ పోలీస్ స్టేషన్ పరిధిలోని చెన్నమ్మ హోటల్ సమీపంలో జరిగింది. ఓ కారు మితిమీరిన వేగంతో వచ్చి అదుపుతప్పి ముందు వెళ్తున్న మరో కారును ఢీకొంది.

ఇలా మొత్తం తొమ్మిది కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో వాహనాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. స్వల్ప గాయాలతో కార్లలోని ప్రయాణికులు బయటపడ్డారు. అయితే కార్లు వరుసగా ఢీకొనంతో 2 కి.మీ.ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో వాహన దారులు ఇబ్బందులు పడ్డారు. ఓఆర్‌ఆర్ సిబ్బంది, ట్రాఫిక్ పోలీసులు కలిసి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు.