calender_icon.png 20 September, 2025 | 10:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వికలాంగులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి

20-09-2025 07:36:18 PM

మందమర్రి,(విజయక్రాంతి): రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం గత అసెంబ్లీ ఎన్నికల సంద ర్భంగా ఎన్నికల మేనిఫెస్టోలో వికలాంగులకు ఇచ్చిన హామీలు, సంక్షేమాన్ని వెంటనే అమలు చేయాలని ఎమ్మార్పీఎస్ మండల ఇంచార్జ్ జీడి సారంగం, విహెచ్పిఎస్ పట్టణ అధ్యక్షులు రామ్ శ్రీనివాస్ లు డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం మున్సి పల్ కమిషనర్ తుంగపిండి రాజలింగు కు వికలాంగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రాన్ని అందజేశారు.

రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టి 20 నెలలు గడిచినప్పటికీ వికలాంగులకు ఇచ్చిన ఏ ఒక్క హామీనీ నిలబెట్టు కోలేదని వారు మండి పడ్డారు. వికలాంగులకు ఇచ్చిన అన్ని హామీలను వెంటనే నెరవేర్చాలని, పింఛన్ 6000 కు పెంచి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి నేటి వరకు మొత్తం బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేశారు.