calender_icon.png 23 January, 2026 | 2:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అసోసియేట్ ప్రొఫెసర్లుగా పదోన్నతి

23-01-2026 01:16:25 AM

హర్షం వ్యక్తంచేసిన ఉపాధ్యాయ సంఘం 

హైదరాబాద్, జనవరి 22 (విజయక్రాంతి) : వివిధ ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో పని చేస్తున్న 104 మం దికి పైగా అధ్యాపకులకు  అసోసియేట్ ప్రొఫెసర్‌గా పదోన్నతి లభిం చింది. 14 ఏళ్ల బోధన సేవలు, పరిశోధనా అనుభావాన్ని గుర్తించిన ప్ర భుత్వం అన్ని సబ్జెక్టులతో కలిపి మల్టీజోన్ 1 నుంచి 50 మంది, మల్టీజోన్ 2 నుంచి 54 మంది అధ్యాపకులు పదోన్నతికి అర్హత సాధించారు.

డిగ్రీ కళాశాలలకు చెందిన ఉపాధ్యాయులకు అసోసియెట్ ప్రొఫెసర్‌గా పదో న్నతి కల్పించడంపై అద్యాపకుల సం ఘంరాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎరుగు బ్రిజేష్ , సౌందర్య జోసెఫ్, శ్రీనివాస్‌గౌడ్, అమరందర్‌రెడ్డి తదితరులు హర్షం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి, విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితారాణా, కమిషనర్ శ్రీదేవసేన ఇతర అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.