10 April, 2026 | 3:51 PM

Breaking News

అన్నా.. నన్ను దేవుడే పంపిండు— కేసీఆర్‌ను కలిసి జీవన్ రెడ్డి భావోద్వేగం   •   ఉపాధి హామీ పనులు వేసవిలో ఉదయం పూట చేసుకోవాలి   •   'ఇజ్రాయెల్ ఒక క్యాన్సర్ దేశం' — పాకిస్థాన్ రక్షణ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు   •   క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు   •   ఫార్మా కంపెనీలో గాయపడిన కార్మికులకు అండగా ఉంటాం   •   అమెరికా, ఇరాన్ శాంతి చర్చలపై కమ్ముకున్న నీలినీడలు   •   తల్లి ఇద్దరు కుమార్తెల హత్య.. భర్తతోపాటు ఆ 10 మంది అరెస్ట్   •   బీఆర్ఎస్ కట్టిన ప్రాజెక్టులన్నీ కాసుల కోసమేనా? అన్నీ మామ, అల్లుడికే తెలుసంటే ఎలా?   •   కాళేశ్వరం దేవస్థానం డైరెక్టర్ గా నియమితులైన కాటం సత్యం   •   గోదావరి పుష్కరాల ఘాట్లకు వెళ్లే రోడ్లను నిర్ణీత సమయంలోగా పూర్తి చేయాలి   •  

అసోసియేట్ ప్రొఫెసర్లుగా పదోన్నతి

23-01-2026 01:16 AM

హర్షం వ్యక్తంచేసిన ఉపాధ్యాయ సంఘం 

హైదరాబాద్, జనవరి 22 (విజయక్రాంతి) : వివిధ ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో పని చేస్తున్న 104 మం దికి పైగా అధ్యాపకులకు  అసోసియేట్ ప్రొఫెసర్‌గా పదోన్నతి లభిం చింది. 14 ఏళ్ల బోధన సేవలు, పరిశోధనా అనుభావాన్ని గుర్తించిన ప్ర భుత్వం అన్ని సబ్జెక్టులతో కలిపి మల్టీజోన్ 1 నుంచి 50 మంది, మల్టీజోన్ 2 నుంచి 54 మంది అధ్యాపకులు పదోన్నతికి అర్హత సాధించారు.

డిగ్రీ కళాశాలలకు చెందిన ఉపాధ్యాయులకు అసోసియెట్ ప్రొఫెసర్‌గా పదో న్నతి కల్పించడంపై అద్యాపకుల సం ఘంరాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎరుగు బ్రిజేష్ , సౌందర్య జోసెఫ్, శ్రీనివాస్‌గౌడ్, అమరందర్‌రెడ్డి తదితరులు హర్షం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి, విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితారాణా, కమిషనర్ శ్రీదేవసేన ఇతర అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.