కొనుగోళ్లు వేగవంతం చేయాలి

24-04-2024 01:48:10 AM

అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి

సిద్దిపేట, ఏప్రిల్ 23 (విజయక్రాంతి): ధాన్యం కొనుగోళ్లలో జాప్యం చేయకుండా వేగంగా పూర్తి చేయాలని అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి అధికారులను, సిబ్బందిని ఆదేశించారు. మంగళవారం దుబ్బా క మార్కెట్‌యార్డులో కొనుగోలు కేం ద్రాన్ని ఆయన పరిశీలించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే రైస్ మిల్లులకు తరలించాలన్నారు. అకాల వర్షాలకు ధాన్యం తడవకుండా టార్ఫాలిన్ కవర్లు కప్పి ఉంచాలన్నా రు. జిల్లాలో 418కొనుగోలు కేంద్రా లు ఏర్పాటు చేయగా, ఇప్పటివరకు 4536మంది రైతుల నుంచి 21,279 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామన్నారు. ఆయన వెంట సివిల్ సప్లు మేనేజర్ హరీశ్, దుబ్బాక తహసీల్దార్, సిబ్బంది ఉన్నారు.