10-05-2025 12:32:25 AM
- ప్రధానోపాధ్యాయులు జమీరోద్దీన్
దుబ్బాక / సిద్దిపేట, మే 9 (విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్య లభిస్తుందని దుబ్బాక ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు జమీరోద్దీన్ తె లిపారు. శుక్రవారం దుబ్బాక బడిబాట నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ ప్రభుత్వ పాఠశాలలో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులచే నాణ్యమైన విద్యా బో ధన, ఉచితంగా యూనిఫామ్, మధ్యాహ్న భోజన సౌకర్యం ఉందన్నారు. తల్లిదండ్రులు వేలకు వేలు ప్రైవేట్ పాఠశాలకు ఫీజులు చెల్లించకుండా ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలన్నారు.
ప్రభుత్వ పాఠశాలలో విద్యా ర్థులకు డిజిటల్ వదనంలో బోధన జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యా యులు నరేందర్, లక్ష్మారెడ్డి, వెంకటేశం, ప్రభాకర్, నరసింహారావు, కృష్ణ కాంత్, కుమారస్వామి, రవీందర్ రెడ్డి, అవినాష్, రామకృష్ణ, రాజు, మేరాజ్ బేగంలు పాల్గొన్నారు.