17 July, 2026 | 3:17 PM

గురుకులాల్లో నాణ్యమైన సరుకులు వాడాలి

16-07-2025 12:00 AM

మైనారిటీ గురుకుల కార్యదర్శి షఫీయుల్లా

హైదరాబాద్, జూలై 15 (విజయక్రాంతి): రాష్ట్రంలోని అన్ని సంక్షేమ గురుకులాలు, వసతిగృహాల్లో ప్రొక్యూర్మెంట్ ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలని ఉన్నతాధికారుల కు మైనారిటీ గురుకుల కార్యదర్శి షఫీయు ల్లా సూచించారు. మంగళవారం సచివాలయంలో సంక్షేమ గురుకులాలు, వసతిగృహా ల్లో నిత్యావసర సరకుల ప్రొక్యూర్మెంట్, ఇత ర సరుకుల సేకరణపై  సమావేశం నిర్వహిం చారు.

టెండర్ ప్రక్రియను పారదర్శకంగా ని ర్వహించాలనారు. ఈ సందర్బంగా కమిటీల ఏర్పాటు, నిర్వహణకు సంబంధించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ప్రొక్యూర్మెంట్ ప్రక్రియ వేగవంతం చేయడంలో ప్రా జెక్టు మానిటరింగ్ యూనిట్ చైర్మన్, ఎస్సీ గురుకుల సెక్రటరీ డాక్టర్ అలుగు వర్షిణిని ఆయన  ప్రత్యేకంగా అభినందించారు.