17 April, 2026 | 3:17 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

బాలసరస్వతి దేవి మరణం చలనచిత్ర రంగానికి తీరని లోటు

15-10-2025 02:21 PM

హైదరాబాద్: తెలుగు నేపథ్య గాయని రావు బాలసరస్వతీ దేవి (97)(Raavu Balasaraswathi Devi Passes Away) కన్నుమూశారు. ఆగష్టు 29, 1928 లో జన్మించిన బాలసరస్వతి దేవి ఆరో ఏట నుంచే గాయనిగా పాటలు పాడ‌డం మొదలుపెట్టారు. ‌పాతతరం తెలుగు చలనచిత్రాల నటిగా, నేపథ్యగాయనిగా పేరు సంపాదించారు. తెలుగు చలనచిత్ర రంగం తొలి నేపథ్య గాయని రావు బాలసరస్వతి మృతి పట్ల ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) తీవ్ర సంతాపం ప్రకటించారు. దక్షిణాదిలో తొలి నేపథ్య గాయనిగా, తెలుగు సినిమా రంగానికి లలిత సంగీతాన్ని పరిచయం చేసిన బాలసరస్వతి దేవి మరణం చలనచిత్ర రంగానికి తీరని లోటని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. శోకతప్తులైన వారి కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. బాలసరస్వతీ దేవి మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు.