15 April, 2026 | 12:54 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఎగ్జిట్ పోల్స్‌పై నిషేధం

15-10-2025 01:44 PM

హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు(Jubilee Hills by elections) ముందు మీడియా ఎగ్జిట్ పోల్స్(Exit polls) పై నిషేధం విధిస్తున్నట్లు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (Greater Hyderabad Municipal Corporation) బుధవారం ప్రకటించింది. నవంబర్ 6న ఉదయం 7:00 గంటల నుండి నవంబర్ 11న సాయంత్రం 6:30 గంటల వరకు నిషేధం అమలులో ఉంటుందని అధికారులు వెల్లడించారు. ఇది టెలివిజన్, రేడియో, వార్తాపత్రికలు, సోషల్ మీడియా, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లతో సహా అన్ని మీడియా ఛానెళ్లకు వర్తిస్తుంది. ఉల్లంఘిస్తే ప్రజాప్రాతినిధ్య చట్టం, 1951 ప్రకారం జైలు శిక్ష లేదా జరిమానా విధించబడుతుంది" అని తెలంగాణ సమాచార, ప్రజా సంబంధాల శాఖ పేర్కొంది. జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసి కమిషనర్ ఆర్.వి. కర్ణన్(R.V. Karnan) ఎన్నికల నియమాలను కచ్చితంగా పాటించాలని అన్ని వర్గాలను కోరారు.