10-05-2024 01:06:08 AM
అంబానీ, అదానీలు టెంపోల్లో డబ్బులు పంపుతారా?
ఇది మీ అనుభవంతో చెబుతున్నారా?
ప్రధాని వ్యాఖ్యలపై రాహుల్ కౌంటర్
న్యూఢిల్లీ, మే 9: కాంగ్రెస్కు అంబానీ, అదానీతో ఒప్పందం కుదిరిందని వేములవాడ సభలో ప్రధాని నరేంద్రమోదీ చేసిన ఆరోపణలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ స్పందించారు. ఈ విషయంలో మీరు భయపడుతున్నారా? అని ప్రశ్నించారు. ఓ వీడియో సందేశంలో మాట్లాడుతూ.. నమస్కారం మోదీజీ... మీరు భయపడ్డారా? సాధారణంగా మీరు అంబానీ, అదానీ గురించి అంతర్గతంగా లేదా తెరవెనుక మాట్లాడుతారు. ఇప్పుడు మొదటిసారిగా వారి పేర్లను బహిరంగంగా ఉపయోగించారు అంటూ మోదీ ఆరోపణలను రాహుల్ తిప్పికొట్టారు.
ఈడీ పంపాలంటూ సలహా..
వేములవాడ సభలో మోదీ మాట్లాడుతూ.. ఎన్ని టెంపో లోడ్ల నల్లధనం కాంగ్రెస్కు చేరింది? ఏం ఒప్పందం కుదిరింది? రాత్రికి రాత్రే అంబానీ, అదానీలపై ఆరోపణలు ఆగిపోయాయి అంటూ ఎద్దే వా చేశారు. ఈ విమర్శలకు రాహుల్ బదులిస్తూ.. వాళ్లు టెంపోల నిండా డబ్బులి స్తారని మీకెలా తెలుసు? ఇది మీకు వ్యక్తిగత అనుభవమేనా? అని కౌంటర్ ఇచ్చారు. మీకు ఒకవేళ అనుమానం ఉంటే అంబానీ, అదానీపైకి ఈడీని పంపాలని మోదీని రాహుల్ కోరారు. కాంగ్రెస్ పార్టీకి నల్లధనం ఇచ్చారనే ఆరోపణలపై వీలైనంత త్వరగా లోతైన దర్యాప్తు చేయించాలన్నారు. వారిపైకి ఈడీని పంపేందుకు భయపడవద్దని కూడా సలహా ఇచ్చారు. బీజేపీ అవినీతి టెంపోకు డ్రైవర్ ఎవరు? హెల్పర్ ఎవరో దేశం మొత్తానికి తెలుసంటూ చురకలంటించారు.