calender_icon.png 7 June, 2025 | 10:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గిరిజన విద్యార్థుల ఎదుగుదలకు కృషి చేసిన వ్యక్తి రమణయ్య

02-06-2025 12:53:00 AM

భద్రాచలం శాసనసభ్యుడు తెల్లం వెంకట్రావు, ఐటీడీఏ పీవో రాహుల్

భద్రాచలం, జూన్ 1 (విజయక్రాంతి): వృత్తి పట్ల ఆకుంటిత దీక్ష పట్టుదల గిరిజన విద్యార్థుల విద్యాభివృద్ధికై అహర్నిశలు పాటుపడ్డ నిరాడంబరుడు మనసులో ఎటువంటి కల్మషం లేని మహోన్నత వ్యక్తి ఎల్లం రమణయ్య అని భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు అన్నారు.

ఆదివారం భద్రాచలం పట్టణంలోని కేకే ఫంక్షన్ హాల్ లో ఐటీడీఏ విద్యా శాఖలోని పీఎంఆర్సి కార్యాలయంలో ఏ సి ఎం ఓ గా విధులు నిర్వహిం చి ఉద్యోగ పదవి విరమణ చేసిన తెల్లం రమణయ్య పదవి విరమణ సన్మాన కార్యక్రమంలో ఐటీడీఏ పీవో బి రాహుల్, ట్రై కార్ జిఎం శంకర్రావుతో కలిసి రమణయ్య దంపతులకు ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ ఐటీడీఏ విద్యా శాఖలో పనిచేయుచున్న రమణయ్య దా దాపు 30 సంవత్సరాలుగా తనకి పరిచయమని మనసులో ఎటువంటి కల్మషం లేని నిరాడంబరుడు, గిరిజన విద్యార్థినీ విద్యార్థులకు విద్యాభివృద్ధి కోసం ఎనలేని కృషి చేశారని, తా ను ఉద్యోగానికి 19 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే తనకి ఉద్యోగం రావడం జరిగిందని, మారుమూల ప్రాంతాలలో ఉ న్న గిరిజన విద్యార్థినీ విద్యార్థులకు తనదైన శైలిలో విద్యాబుద్ధులు నేర్పించి వారికి విద్య పట్ల మక్కువ కలిగేలా పాటుప డ్డాడన్నారు.

బడి మానివేసిన పిల్లలను కూడా వారి ఇండ్లకు వెళ్లి వారికి నచ్చజెప్పి పాఠశాలల్లో చేర్పించారని, చిన్న స్థాయి ఎస్జిటి ఉపాధ్యాయుడుగా ఉద్యోగ ప్రస్థానం మొదలుపెట్టి ఉద్యోగం చేసుకుంటూనే పై చదువులు చదువుకుంటూ పీజీహెచ్‌ఎం వరకు వివిధ హోదాను పొంది ఐటీడీఏ పీఎంఆర్సి లో ఏ సి ఎం ఓ గా విధులు నిర్వహించి, విద్యార్థులకు విద్య పట్ల మక్కువ కలిగేలా బుక్ లెట్స్ రూపొందించి గిరిజన వి ద్యార్థుల విద్యాభివృద్ధి కొరకు పాటుపడ్డారన్నారు.

అనంతరం ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ మాట్లాడుతూ ఐటీడీఏ పీవో గా 11 నెలలు కాలంలోనే ఏసీఎంఓ రమణయ్య ద్వారా గిరిజన విద్యార్థుల విద్యాభ్యాసం పునాది నుండే బలపడడానికి ఎన్నో రకాల సంస్కరణలు చేసి ఉద్దీపకం వర్క్ బుక్స్ నుంచి కెరిర్ గైడెన్స్ వరకు గిరిజన విద్యార్థిని విద్యార్థులకు అవగాహన కలిగించడానికి ఎంతో కృషి చేశారని అ న్నారు.

గిరిజన విద్యార్థినీ విద్యార్థుల విద్యాభ్యాసం చిన్న తరగతుల నుండి బలోపేతం కావడానికి నిష్ణాతులైన ఉపా ధ్యాయులను ఎంపిక చేసి వారి ద్వారా ఉద్దీపకం బుక్లెట్స్ రూ పొందించి జిపిఎస్ పాఠశాలలకు పంపించి పిల్లల చదువు మె రుగుపడేలా కృషిచేసిన రమణయ్య ను ఈ సందర్భంగా ప్రత్యే క అభినందనలు తెలుపుతున్నట్లు ఆయన తెలిపారు.

ఉద్యోగ విరమణ అనేది ఉద్యోగానికే కానీ జీవితానికి కాదని తన శేష జీవితాన్ని కుటుంబ సభ్యులతో గడిపి ఐటిడిఏ విద్యాశాఖలో చేస్తున్న తన తోటి ఉద్యోగులకు తన యొక్క అనుభవాలను సహాయ సహకారాలను తప్పనిసరిగా అందించాలని కోరు తూ నిండు నూరేళ్లు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని కోరుచున్నాను.

అనంతరం వివిధ పాఠశాలల నుండి వచ్చిన హెచ్‌ఎంలు ఉపాధ్యాయులు బంధువులు రమణయ్య దంపతులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో డిడి ట్రైబల్ వెల్ఫేర్ అధికారిని మణెమ్మ, వివిధ శాఖల అధికారు లు, పాఠశాలలు నుండి వచ్చిన హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.