calender_icon.png 6 June, 2025 | 10:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిల్లాస్థాయి రాజకీయ శిక్షణ తరగతులు విజయవంతం చేయాలి

02-06-2025 12:54:26 AM

సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం

చండూరు, జూన్ 1  ( విజయ క్రాంతి): ఈ నెల 4,5,6 తేదీలలో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగే సిపిఎం పార్టీ జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను విజయవంతం చేయాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నరేంద్ర మోడీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక వర్గ హక్కులను కాల రాస్తుందని, వ్యవసాయ రంగాన్ని తీవ్ర సంక్షోభంలో నెట్టింది, ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసి పేదల పొట్టలు కొడుతుందని వారు విమర్శించారు.

చతిస్గడ్లో జరిగిన ఎన్ కౌంటర్లో మావోయిస్టు ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావుతో పాటు 27 మంది మావోయిస్టులను మృతి చెందడంపై ఆయన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మావోయిస్టుల విజ్ఞప్తి లేఖను పట్టించుకోలేదని ఆయన మండిపడ్డారు. మూర్ఖంగా మావోయిస్టుల పేరుతో గిరిజనులను కాల్చి చంపుతున్నారని ఆయన ఆరోపించారు. అటవీ సంపదను కార్పోరేట్ శక్తులకు అప్పగించడం కోసం ఆపరేషన్ కగారు పేరుతో మోడీ ప్రభుత్వం మావోయిస్టులను, ఆదివాసీలను బూటకపు ఎన్ కౌంటర్ చేయడం సరైంది కాదని ఆయన అన్నారు. 

ఇకనైనా కేంద్ర ప్రభుత్వం భేషరతుగా ఆపరేషన్ కగారు ను నిలిపేయాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం చండూరు మండల కార్యదర్శి జెర్రిపోతుల ధనంజయ, సిపిఎం మండల కమిటీ సభ్యులు మొగుదాల వెంకటేశం, చిట్టి మల్ల లింగయ్య, కొత్తపల్లి నరసింహ, గౌసియా బేగం, రైతు సంఘం మండల కార్యదర్శి వెంకటయ్య, స్వామి తదితరులు పాల్గొన్నారు.