17 April, 2026 | 3:17 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

సేంద్రియ వ్యవసాయం చేస్తున్న రైతు సుధాకర్ కు అరుదైన గౌరవం

26-10-2025 08:26 PM

సుల్తానాబాద్ (విజయక్రాంతి): సుల్తానాబాద్ మండలం మియాపూర్ గ్రామానికి చెందిన నలువల సుధాకర్ గత 20 సంవత్సరాలుగా సేంద్రియ వ్యవసాయం ద్వారా వరి, కూరగాయలు, పప్పు దినుసులు, ఎద్దు గానుగ నూనె, మిరప, పసుపు, వంటి పంటలు పండిస్తూ, గ్రామ రైతులలో పెద్దపల్లి రైతు ఉత్పత్తి సంస్థ ఏర్పాటు చేసి రైతులకు వివిధ రకాల సేవలు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. సుధాకర్ చేస్తున్న సేవలను గుర్తించి రైతు నేస్తం-స్వర్ణ భారత్ స్వచంద సంస్థ ద్వారా ఉత్తమ రైతుగా గుర్తించి ప్రశంసా పత్రాన్ని ఆదివారం హైదరాబాదులో జరిగిన కార్యక్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు చేతుల మీదుగా స్వీకరించారు.