2 June, 2026 | 6:28 PM

Breaking News

విద్యుత్ సరఫరా పునరుద్ధరణలో విశేష సేవలు అందించిన లైన్‌మ్యాన్ దేవ్ సింగ్ కు ఉత్తమ ఉద్యోగి అవార్డు   •   మండల వ్యాప్తంగా ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు   •   గుంజపడుగు గ్రామంలో వ్యర్థాలపై ప్రజలకు సర్పంచ్ అవగాహన   •   ఘనంగా అవతరణ వేడుక   •   పలు గ్రామాల్లో పీసీసీ కేంద్రాలను సందర్శించిన డిసిఎస్ఓ వెంకటేశ్వర్లు   •   పట్టపగలే యదేచ్చగా మొరం తవ్వకాలు.. చోద్యం చూస్తున్న అధికారులు   •   అమరవీరుల స్తూపం వద్ద ఘనంగా నివాళులు అర్పించారు   •   కాగజ్‌నగర్ సభలో ఎమ్మెల్యేకు ప్రోటోకాల్ అంశంపై బీఆర్ఎస్ ఆరోపణలు   •   పరిపాలన చేతకాక సీఎం బూతు మాటలు మాట్లాడుతున్నారు: ఎమ్మెల్యే తలసాని   •   రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఉద్యమకారులు, పారిశుధ్య కార్మికులకు ఘన సన్మానం   •  

నాగులపల్లి హైవే 44 బ్రిడ్జిపై భారీగా ట్రాఫిక్..

26-10-2025 09:08 PM

తూప్రాన్ (విజయక్రాంతి): మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపల్ పరిధిలోని బయ్యర్ కంపెనీ సమీపం నాగులపల్లి బ్రిడ్జి 44వ జాతీయ రహదారిపై మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో మహారాష్ట్ర నాగపూర్ నుండి భారీ ట్రయల్ ద్వారా 27,000 కేజీల స్టీల్ కాయిల్ వస్తుండగా తూప్రాన్ నాగులపల్లి బ్రిడ్జిపై రాగానే బిగించిన చైన్ తెగిపోయి కింద పడిపోవడం జరిగింది. ఆ సమయం నుండి చిన్న క్రేన్ ద్వారా లేపే ప్రయత్నం చేయగా సాధ్యం కాలేదు. సంబంధిత కంపెనీ యాజమాన్యం వారు చేగుంట నుండి భారీ క్రేయిన్ తీసుకొని వచ్చి ట్రైలర్ పై నిలిచి పెట్టడం జరిగింది. దీంట్లో భాగంగా నాగులపల్లి 44వ జాతీయ రహదారి మాసాయిపేట నుండి సంఘటన స్థలం వరకు పూర్తిగా ట్రాఫిక్ తో కూరుకుపోయింది. వాహనాదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు.