16 April, 2026 | 11:51 PM

Breaking News

సదాశివపేట పట్టణ ప్రజల తాగునీటి సమస్యలపై జగ్గారెడ్డి, నిర్మల సమీక్ష   •   గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •  

37 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

17-11-2025 10:26 PM

జిన్నారం/అమీన్ పూర్: బొల్లారం, జ్యోతినగర్ ప్రాంతంలో అక్రమంగా ప్రభుత్వ రేషన్ బియ్యం తరలిస్తున్న ఘటన బయటపడింది. స్థానిక అధికారులకు లభించిన సమాచారం మేరకు నిర్వహించిన దాడిలో 80 బస్తాలు సుమారు 37 క్వింటాళ్లు రేషన్ బియ్యం తరలిస్తున్న ఆటోను అధికారులు అడ్డుకుని సీజ్ చేశారు. ఈ ఘటనలో డ్రైవర్ రాజు, ఆటో యజమాని జైపాల్‌తో పాటు అక్రమంగా రేషన్ బియ్యం విక్రయించిన రేషన్ డీలర్ అలివేలమ్మపై కూడా చర్యలు తీసుకున్నారు. డిప్యూటీ తహసీల్దార్ సివిల్ సప్లై అనిల్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనతో రేషన్ బియ్యం అక్రమ రవాణాపై అధికారులు మరింత అప్రమత్తమయ్యారు.