25-09-2025 12:11:13 AM
జిన్నారం, సెప్టెంబర్ 24 :జిన్నారం మండల వ్యాప్తంగా దుర్గా దేవి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా మూడవ రోజైన బుధవారం జంగంపేటలోని రేణు క ఎల్లమ్మ అమ్మవారు భక్తులకు గాయత్రి మాతగా దర్శనమిచ్చారు. ఆలయ పూజారి శ్రీనివాస్ భార్గవ ఆధ్వర్యంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగాయి. జంగంపేట ప్రజలతోపాటు చుట్టుపక్కల భక్తులు అమ్మవారిని దర్శి దర్శిం చుకునేందుకు భారీగా హాజరయ్యారు.