6 May, 2026 | 11:50 PM

Breaking News

మల్లెలమడుగు, రామచంద్రాపురం గ్రామాల్లో ఎమ్మెల్యే పాయం జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ   •   కుటుంబ కలహాలతో భార్యను చంపిన భర్త   •   కాంట పూర్తయ్యాక కుప్ప వద్దే పడిగాపులెందుకు..?   •   ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ   •   లింగంపల్లి వెంకంపల్లి గ్రామాల్లో ఇందిరమ్మ నిర్మాణాల గృహప్రవేశం   •   నూతన వధూవరులను ఆశీర్వదించిన టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్   •   ఆధునిక సాగుతోనే అధిక దిగుబడులు   •   వివాహ వేడుకలో నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే, ఎంపీ   •   సామాజిక బాధ్యతపై యువతకు అవగాహన   •   శివంపేట గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు   •  

బ్రిడ్జిలు నిర్మించాలని ఎంపీ డీకే అరుణకు వినతి

20-09-2025 07:13 PM

రాజాపూర్: మండల కేంద్రంలో ఎన్ హెచ్ 44 జాతీయ రహదారిపై రెండు ఫ్లైఓవర్ బ్రిడ్జిలు నిర్మించాలని శనివారం మండల బిజెపి నాయకులు మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణను కలసి వినతిపత్రం అందజేశారు. రాజాపూర్ మండల కేంద్రం ముఖ్య కూడలిలో ఒక ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మించడం వల్ల ఇబ్బందులు ఏర్పడుతున్నాయని, మండల కేంద్రం నుండి తిరుమలాపూర్ మీదుగా ముంబై వెళ్లే డబల్ రోడ్డు వద్ద మరో ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మించడం వల్ల భారీ వాహనాలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వెళ్తాయని తెలిపారు.

ఒకటే ఫ్లైఓవర్ నిర్మించడం వల్ల మండల కేంద్రంలో వాహనాల రాకపోకలకు చాలా ఇబ్బందులు ఎదురవుతాయని తెలిపారు. జాతీయ రహదారుల మంత్రితో చర్చించి రాజాపూర్ లో రెండు ఫ్లైఓవర్ బ్రిడ్జిలు నిర్మించాలని ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు ఆనంద్, జిల్లా కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు వనపర్తి నర్సింలు, సీనియర్ నాయకులు రామకృష్ణ, శేఖర్, రాజు, గంగాధర్ గౌడ్, ప్రవీణ్ కుమార్, అరుణ్ రెడ్డి, మండల భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.