17 April, 2026 | 12:08 PM

Breaking News

హరివంశ్ రాజ్యసభ ఉపసభాపతిగా ఏకగ్రీవం   •   ఏడేళ్లుగా డిప్యూటీ స్పీకర్ పదవి ఖాళీగా ఉంచడంలో అర్థమేంటీ?   •   హన్మకొండ జిల్లా అక్రిడిటేషన్ కమిటీ ఖరారు   •   ఉపాధి హామీ కూలీలకు త్రాగునీటి ఇబ్బంది లేకుండా చూడండి   •   కీలక బిల్లులపై సర్వత్రా ఉత్కంఠ! లోక్‌సభలో 4 గంటలకు ఓటింగ్   •   రేవంత్ రెడ్డి హైబ్రిడ్ ఫార్ములా కాదు.. అది అసదుద్దీన్ ఓవైసీ ఫార్ములా   •   సోనాల మండల కేంద్రంలో నిఘా నేత్రాల ఏర్పాటు   •   డిల్లీ లో వేం నరేందర్ రెడ్డి కి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే జారె   •   రోడ్డు భద్రతా ప్రమాణాలపై ఐజీ చంద్రశేఖర్ రెడ్డితో సమావేశం   •   వృద్ధుల కోసం వైద్య సేవలు అందించడం ఎంతో అవసరం   •  

ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలి

31-12-2025 12:00 AM
  1. బీసీ ఉపాధ్యాయ సంఘానికి ప్రభుత్వం గుర్తింపును ఇవ్వాలి

జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ 

హైదరాబాద్, డిసెంబర్ 30 (విజయక్రాంతి): బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని, బీసీ ఉపాధ్యాయ సంఘానికి రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపును ఇవ్వాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్ చేశారు. మంగళవారం హైదరాబాదులోని బీసీ భవన్‌లో బీసీ ఉపాధ్యాయ సంఘం బీసీటీయూ రాష్ట్ర సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో శ్రీనివాస్‌గౌడ్ ప్రసంగించారు.

జనాభాలో 60 శాతంపైగా ఉన్న బీసీలకు ఉద్యోగ రంగంలో స్వాతం త్య్రం వచ్చిన 80 సంవత్సరాల తర్వాత కూడా 20% కూడా ప్రాతినిధ్యం దక్కడం లేదన్నారు. ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 70 వేల మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు ఉంటే అందులో 40 వేల మం ది బీసీ ఉపాధ్యాయులు ఉన్నారని ఇంతమంది ఉన్న బీసీ ఉపాధ్యాయులకు ప్రభుత్వం తక్షణమే గుర్తింపుని ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఇన్ సర్వి స్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. పెండింగ్‌లో ఉన్న ఆరు డీఏలను విడుదల చేయాలని, పెండింగ్ బిల్లులను చెల్లించాలన్నారు. పిఆ ర్సీని 50 శాతం ఫిట్‌మెంట్‌తో అమలు చేయాలని, మోడల్ స్కూల్, గురుకుల పాఠశాల ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరిం చాలని కోరారు. బీసీ ఉద్యోగుల హక్కుల కోసం మార్చి రెండో వారంలో హైదరాబాదులో బీసీ ఉపాధ్యాయుల రాష్ట్ర మహాసభ ను నిర్వహిస్తామిన వెల్లడించారు. బీసీ ఉపాధ్యాయ సం ఘం రాష్ట్ర బాధ్యులుగా కొన్నే శంకర్‌గౌడ్, రాఘవాపురం గోపాలకృష్ణలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సమావేశంలో వివిధ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మాడవేడి వినోద్ కుమార్, శ్రీనివాస్, రమణ స్వామి, భాస్కర్ మహెందర్, గోపి కృష్ణ, కుల్కచర్ల శ్రీనివాస్, విక్రం గౌడ్, మనీ మంజరి పాల్గొన్నారు.