19-06-2025 12:37:53 AM
పాల్గొన్న టీజీఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి
సదాశివపేట, జూన్ 18 : సదాశివపేట మండలంలోని నందికంది, వెల్టూర్ గ్రామాల్లో రెవెన్యూ సదస్సుకు ముఖ్య అతిథిగా టీజీఐఐసీ చైర్మన్ నిర్మల జయప్రకాశ్ రెడ్డి హాజరై ప్రజల భూ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ధరణి వల్ల రైతులు ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నారని తెలిపారు. ప్రజా ప్రభుత్వంలో రైతులు ఎలాంటి రుసుము చెల్లించకుండా కార్యాలయ సిబ్బంది మీ చెంతకు వచ్చి సమస్యలు పరిష్కరిస్తున్నారని తెలిపారు.
గత కొన్ని సంవత్సరాల నుండి పరిష్కారం కాని సమస్యలు పరిష్కారం అవుతున్నందున రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో తాహసిల్దార్, నయబ్ తాహసిల్దార్, ఆర్ఐ మిగతా రెవెన్యూ సిబ్బంది కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సిద్దన్న, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కంది కృష్ణ, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, చింటూ గౌడ్, ప్రభు, నవీన్,లక్ష్మారెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు.