06-06-2025 01:12:16 AM
సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్రెడ్డి
కొత్తపల్లి, జూన్ 5 (విజయ క్రాంతి): భూసంబంధ సమస్యలున్న ప్రతిఒక్కరు రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. కొత్తపల్లి మండలం ఎల్గందల్ లో జరిగిన రెవెన్యూ సదస్సుకు సుడా చైర్మన్ ముఖ్య అతిథిగా సదస్సుకు హాజరై ప్రజలనుండి దరఖాస్తులు స్వీకరించారు.
ఈ సందర్భంగా నరేందర్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ధరణితో ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని కాంగ్రెస్ ప్రభుత్వం ఆసమస్యలకు పరిష్కారం చూపాలనే భూభారతి తీసుకువచ్చిందని పేర్కొన్నారు. రెవెన్యూ సదస్సులలో దరఖాస్తు చేసుకుని రసీదు తీసుకున్న వెంటనే అధికారులు విచారణ జరిపి పరిష్కారం చేస్తారని అన్నారు.
గతంలోలాగా ఆఫీసుల చుట్టూ తిరుగాల్సిన అవసరం లేదని అధికారులే మీవద్దకు వచ్చి విచారణ జరిపి సమస్యలను పరిష్కరిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కొత్తపల్లి తహశీల్దార్ వెంకట లక్ష్మి, డిప్యూటీ తహశీల్దార్ సుమలత, ఆర్ఐలు రజనీ కుమార్, నదీం, సీనియర్ అసిస్టెంట్ సోనియా, కాంగ్రెస్ నాయకులు శ్రవణ్ నాయక్, స్వామి గౌడ్, నిమ్మల అంజయ్య, గుండాటి శ్రీనివాస్ రెడ్డి, ఆరే.మల్లేశం, సతీష్, తదితరులుపాల్గొన్నారు.