10-10-2025 11:30:22 PM
మేడిపల్లి,(విజయక్రాంతి): 5 సంవత్సరాల లోపు పిల్లలకు బోడుప్పల్ నగర పాలక సంస్థ యందు చెంగిచర్లలో(02), బోడుప్పల్ లో(17) ప్రాధమిక ఆరోగ్య కేంద్రములలో అక్టోబర్ 12 న నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమం ఏర్పాట్ల పై శుక్రవారం బోడుప్పల్ కమీషనర్ శైలజా మెడికల్ ఆఫీసర్స్, మునిసిపల్ అధికారులు, వార్డ్ ఆఫీసర్స్, పారిశుధ్య సిబ్బంది తో అవసరమైన ఏర్పాట్లు, సదుపాయలు గురించి సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగినది. ఈ సందర్బంగా కమీషనర్ మాట్లాడుతూ..ఇట్టి కార్యక్రమం గురించి కాలనీ అసోసియేషన్ వారు తమ కాలనీ లలో గల 0-5 సంవత్సరాల పిల్లలు అందరికీ పోలియో చుక్కలు వేసుకొనేలా వాళ్ళ పేరెంట్స్ కి తెలియ పరిచి ప్రోత్సహించాలని తెలిపారు.