25-08-2025 12:19:48 AM
గుండాల, ఆగస్టు 24 ( విజయ క్రాంతి): గుండాల మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆర్ ఓ వాటర్ ప్లాంట్ ను ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే బీర్లు అయిలయ్య లు ఆదివారం నాడు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హాస్పిటల్ కు వచ్చే ప్రజల దహార్థిని తీర్చేందుకు ఎం పి నిధులను మంజూరు చేశామన్నారు. కాంగ్రెస్ ప్రజా పాలనలో కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల ప్రక్రియ కొనసాగుతుందన్నారు.
మండలంలోని చెరువులన్నింటిని నింపుతామన్నారు..నిజమైన లబ్ధి దారులకు ప్రభుత్వ పథకాలను అందిస్తామన్నారు. ఉమ్మడి జిల్లా మంత్రుల ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి సహకారంతో గుండాల మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆలేరు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు యాదగిరి గౌడ్, మాజీ ఎం పి పి ద్వాప కృష్ణా రెడ్డి, నాయకులు, పొడిశెట్ట్ వెంకన్న,ఇమ్మడి దశరథ గుప్త, దేవన బోయిన ఐలయ్య, శర్పొద్దీన్, చిందం ప్రకాష్, గుండాల కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షుడు అన్నెపర్తి యాదగిరి, కెమిడి రవికుమార్, దార సైదులు, పాచిల్ల గ్రామ శాఖ అధ్యక్షుడు అత్తి సత్తయ్య, డి ఎం హెచ్ ఓ మనోహర్, ప్రాథమిక ఆరోగ్య మెడికల్ ఆఫీసర్ హైమావతి, ఏఎన్ఎం, ఆశ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.