12-02-2026 09:52:02 AM
జైపూర్, (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం రసుల్ పల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందిన ఘటన గురువారం ఉదయం చోటు చేసుకుంది. రసూల్ పల్లి నుంచి మంచిర్యాల వెళ్లే దారిలో బైక్ పై వెళుతున్న ముగ్గురు వ్యక్తులు ప్రమాదానికి గురి కాగా అందులో ఒకరు అక్కడికక్కడే మరణించగా ఇద్దరు తీవ్ర గాయాలకు గురయ్యారు. గాయపడ్డ వారిని మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.