9 April, 2026 | 8:05 PM

Breaking News

అల్లూరి జిల్లాలో విషాదం— సెల్ఫీ సరదా విషాదంగా మారింది.. జలపాతంలో పడి ముగ్గురు మృతి   •   బాన్సువాడలో పలు రైస్ డిపోలపై సివిల్ సప్లై అధికారుల దాడులు   •   కేరళలో 75 శాతం పోలింగ్‌ నమోదు   •   ప్రగతి నగర్‌లో ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలి...   •   హెచ్ఐవిపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి   •   ఏజెన్సీ ప్రాంత రైతుల భూ సమస్యలను పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు   •   హనుమకొండ జిల్లాను వరంగల్ జిల్లాలో కలిపి మహానగరాన్ని అభివృద్ధి చేయండి   •   బీజేపీ ఆధ్వర్యంలో ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు నమోదు   •   ప్రభుత్వ విద్య బలోపేతానికి కృషి చేస్తా..   •  

రోడ్డు ప్రమాదాలను నివారించాలి

10-01-2026 12:13 AM

 హయత్ నగర్ సీఐ నాగరాజు గౌడ్ 

ఎల్బీనగర్, జనవరి 9 : అప్రమత్తతతోనే రోడ్డు ప్రమాదాల నివారణ సాధ్యమని, రోడ్డు ప్రమాదాల నివారణలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని హయత్ నగర్ సర్కిల్ ఇన్ స్పెక్టర్   నాగరాజు గౌడ్ పిలుపునిచ్చారు. ప్రమాదాల నివారణలో రోడ్డు నిబంధనలు పాటిస్తూ, క్రమశిక్షణతో డ్రైవింగ్ చేస్తే ప్రమాదాలు జరగవని సూచించారు.  జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా  శుక్రవారం హయత్ నగర్ బస్టాండ్ లో రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రజలకు అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఇటీవల  రోడ్డు ప్రమాదాల రేటు  పెరగడం ఆందోళన కరమని, ప్రమాదాల్లో ఎక్కువ శాతం మితిమీరిన వేగం, సెల్ ఫోన్ డ్రైవింగ్, నిద్ర మత్తులో, ఓవర్ టేకింగ్, రోడ్ల పై అవగాహన లేకపోవడంతో జరుగుతున్నాయని తెలిపారు.  కార్యక్రమంలో హయత్ నగర్ ఆర్టీసీ డిపో -1 డిపో మేనేజర్ జలగం విజయ్, సహాయ ఇంజినీర్ సురేందర్, డ్రైవర్, కండక్టర్లు పాల్గొన్నారు.