16-08-2025 01:38:24 PM
ఏళ్ళు గడిచినా మరని దుస్థితి.
చింతలమనేపల్లి, (విజయక్రాంతి): ఏళ్ళు గడిచినా ప్రభుత్వాలు మారినా పల్లెలు పల్లెలుగానే ఉన్నాయి. రోడ్డు రవాణా లేకపోవడంతో నేటికీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చింతల మనేపల్లి మండలం గూడెం గ్రామ పంచాయతి శివపెళ్లి గ్రామానికీ సరైన రోడ్డు సౌకర్యం లేక వర్షాకాలం లో బురదలో 3 కిలోమిటర్ల మేర ప్రయాణం చెయ్యాల్సిన పరిస్థితి నెలకొంది. అత్యవసర పరిస్థితుల్లో ఆస్పత్రికి వెళ్లాల్సి వస్తే దేవుడి పై బారం వేయాల్సిందే. ఇప్పటికైనా ప్రజా ప్రతినిధులు స్పందించి రోడ్డు సౌకర్యాన్ని కల్పించాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు.