కారు ప్రమాద బాధిత కుటుంబాలను ఆదుకోవాలి

08-05-2024 01:56:59 AM

బీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్

నాగర్‌కర్నూల్, మే 7(విజయక్రాంతి): కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి మితిమీరిన వేగంతో బైకును ఢీ కొట్టడంతో ఇద్దరు యువకులు మృతిచెందారని, వారి కుటుంబాలను ఆదుకోవాలని నాగర్‌కర్నూ ల్ బీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ డిమాండ్ చేశారు. మంగళవారం కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో మృతుల కుటుంబాలను పరామర్శించి, ఓదార్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మెల్యే కసిరెడ్డి కారు అత్యంత వేగంతో ఢీకొట్టడంతోనే రాములు, నరేశ్ మృతి చెందారని ఆరోపించారు. ఎమ్మెల్యే కారు డ్రైవరుపై హత్యానేరం కింద చర్యలు తీసుకోవాలని కోరారు. ఒక్కో కుటంబానికి రూ.కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. మృతదేహాలను ఫ్రీజర్‌లో పెట్టని ఆసుపత్రి సూపరింటెండెంట్‌పై చర్యలు తీసుకోవాలన్నారు.