1 August, 2026 | 4:24 PM

Breaking News

ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు మరింత మెరుగుపర్చాలి   •   రిఫీలింగ్ సెంటర్లపై దాడి.. 16 గ్యాస్ సిలిండర్లు స్వాధీనం   •   అభివృద్ధి పనులకు ప్రణాళికలు సిద్ధం చేయాలి   •   విద్యార్థులకు అండగా నిలబడడమే 'యూత్ ఫర్ సేవ' లక్ష్యం   •   కోనరావుపేట మండలంలో ఎమ్మార్పీఎస్ నూతన కమిటీల ఏర్పాటు   •   ఆగస్టు 9 ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని జయప్రదం చేయండి   •   తల్లిపాల వారోత్సవాలు   •   బాచ్‌పన్ ఏహెచ్‌పీఎస్ ప్రైమరీ, బీరంగూడలో ఫ్యాన్సీ డ్రస్ పోటీలు   •   మండల సాధారణ సర్వసభ్య సమావేశంలో సమయపాలన పాటించని సర్పంచులు, అధికారులు   •   జనగామను సందర్శించిన హైకోర్టు జడ్జి సూరేపల్లి నందా   •  

ఆర్టీసీ చార్జీల పెంపు అన్యాయం

10-10-2025 01:07 AM

పటాన్ చెరు, అక్టోబర్ 9 : ఆర్టీసీ బస్సు చార్జీలను పెంచడం పేద, మధ్యతరగతి కుటుంబాలను ఇబ్బందులకు గురి చేయడమేనని బీఆర్‌ఎస్ నాయకుడు, ఎండీఆర్ ఫౌండేషన్ చైర్మన్ మాదిరి పృథ్వీరాజ్ తెలిపారు. బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన చలో బస్ భవన్ కార్యక్రమంలో మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు తో కలిసి ఆయన మెహిదీపట్నం నుండి బస్ భవన్ వరకు బస్లో ప్రయాణించి, సాధారణ ప్రయాణికులతో మమేకమై వారి సమస్యలను తెలుసుకున్నారు.

ప్రయాణికుల సమస్యలను వివరంగా విన్న అనంతరం అడ్డగోలుగా పెంచిన ఆర్టీసీ బస్ చార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ పేద, మధ్యతరగతి ప్రజల తరపున బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, నాయకులు కలిసి టీఎస్‌ఆర్టీసీ ఎండీ వై.నాగిరెడ్డి కి వినతిపత్రం సమర్పించారు.