25 July, 2026 | 5:25 PM

Breaking News

టిఐసిసిఐ రాష్ట్ర మీడియా, సాంస్కృతిక విభాగ రాష్ట్ర కో-ఆర్డినేటర్‌గా రామావత్ నాగేంద్ర నాయక్ నియామకం   •   సర్ ప్రక్రియలో పారదర్శకతకు రాజకీయ పార్టీల సహకారం కీలకం   •   అభివృద్ధి పనులకు నిధులు మంజూరు   •   డిసిసి అధ్యక్షుడుపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు   •   కోటగుళ్లలో ఘనంగా తొలి ఏకాదశి పూజలు   •   బిజెపి యువమోర్చా ఘట్‌కేసర్ డివిజన్ అధ్యక్షుడిగా సూర్వి అనిల్ గౌడ్   •   జిల్లా జన గణన హ్యాండ్ బుక్ ప్రమాణాలకు అతిథంగా తీర్చిదిద్దాలి   •   జాతీయ ఓబీసీ సభలు జయప్రదం చేయండి   •   కాటారం మోడల్ సోలార్ విలేజ్ పనులు వేగవంతం చేయాలి   •   హైకోర్టు న్యాయమూర్తులకు స్వాగతం పలికిన కలెక్టర్   •  

హనుమకొండలో ఆర్టీఐ ఆవిర్భావ దినోత్సవ పోస్టర్ ఆవిష్కరణ

25-09-2025 05:25 PM

హనుమకొండ,(విజయక్రాంతి): హనుమకొండ జిల్లా సమాచార హక్కు చట్టం సాధన కమిటీ ఆధ్వర్యంలో ఆర్టీఐ ఆవిర్భావ దినోత్సవ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం గురువారం ఉదయం ఉమ్మడి వరంగల్ ప్రెస్ క్లబ్‌లో జరిగింది. జాతీయ వ్యవస్థాపక  అధ్యక్షుడు డాక్టర్ చంటి ముదిరాజ్ ఈ కార్యక్రమానికి హాజరై పోస్టర్ ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ... సమాచార హక్కు చట్టం సాధన కమిటీ అనేది భారత సమాచార హక్కు చట్టం, 2005 ప్రకారం, ప్రధాన సమాచార కమిషనర్, ఇతర సమాచార కమిషనర్ల నియామకానికి సిఫారసులు చేసే కమిటీ అని, ఈ కమిటీ లో ప్రధానంగా కేంద్రపాలకులు, ముఖ్యమంత్రి, పార్లమెంటులో ప్రతిపక్ష నేతలు మొదలైన వారు సభ్యులుగా  ఉంటారని,సమాచార హక్కు చట్టంలో సెక్షన్ 12 ప్రకారం, ఈ కమిటీకి చోటు ఉంటుందని, ప్రధానమంత్రి కమిటీ చైర్మన్‌గా ఉంటూ, తదితర సభ్యులు ఇందులో భాగస్వామ్యం అవుతారన్నారు.