29-09-2025 07:51:32 PM
ముస్తాబాద్ (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామంలో సోమవారం సాయంత్రం వైభవంగా సద్దుల బతుకమ్మ పండుగ సంబరాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. గ్రామంలోని ప్రధాన రహదారి, వీధుల్లో ఏర్పాటు చేసిన తీరొక్క పూలతో అందంగా పేర్చిన బతుకమ్మల వద్ద మహిళలు గంటన్నర పాటు బతుకమ్మ పాటలతో కనువిందు చేశారు. అనంతరం బతుకమ్మలను చెరువుల వద్దకు తీసుకెళ్లి వచ్చే ఏడాదికి తిరిగి రావమ్మా అంటూ నిమజ్జనం చేశారు. కష్టాలన్ని మర్చిపోయి సంతోషంగా వెంట తీసుకెళ్లిన ఫలహారాలు ఒకరికొకరు పంచిపెట్టుకొని తినడం జరిగింది. ఈ కార్యక్రమంలో మహిళలు, పిల్లలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.