calender_icon.png 2 December, 2025 | 4:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తపస్ మండల అధ్యక్షునిగా సల్లారం

02-12-2025 03:17:58 PM

కొమురవెల్లి,(విజయక్రాంతి): తెలంగాణ ప్రాంతీయ ఉపాధ్యాయ సంఘం( తపస్) కొమరవెల్లి మండల శాఖ కార్యవర్గం ఎన్నికలు మంగళవారం నిర్వహించారు.ఈ ఎన్నిక సిద్దిపేట జిల్లాలో గల శిశుమందిర్ లో నిర్వహించారు. జిల్లా అధ్యక్ష కార్యదర్శుల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ ఎన్నికలలో అధ్యక్ష కార్యదర్శులుగా సల్లారం రామచంద్రారెడ్డి (తపాస్ పల్లి), ఇరుమల్ల రమేష్ (రామ్ సాగర్) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన సల్లారం రామచంద్రారెడ్డి మాట్లాడుతూ సంఘం అప్పగించిన బాధ్యతలు సక్రమంగానే నిర్వహిస్తూ, ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ ను మినాయింపు ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.