calender_icon.png 19 June, 2025 | 4:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జంపన్న వాగు అభివృద్ధికి 5 కోట్లు మంజూరు

19-06-2025 12:36:13 AM

ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన మంత్రి సీతక్క

హైదరాబాద్, జూన్ 18 (విజయక్రాంతి): మేడారం సమక్క- సారలమ్మ జాతరలోని జంపన్న వాగు అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ.5 కోట్లు మంజూరు చేసింది. మంత్రి సీతక్క విజ్ఞప్తి మేరకు ములుగు జిల్లా జం పన్న వాగు రివర్ ఫ్రంట్ అభివృద్ధికి రూ.5 కోట్లు మంజూ రు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.

మేడారం భక్తులు పవిత్ర స్నానం ఆచరించే స్థలంగా జంపన్న వాగు ప్రాచుర్యం పొందింది. మేడారం జాతర సమయంలో జంపన్న వాగులో ప్రతి రోజూ వేల మంది పర్యాటకులు, భక్తులు పవిత్ర స్నానాలు చేస్తారు. నిధుల మంజూరుపై మంత్రి సీతక్క ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.