13 July, 2026 | 9:37 PM

Breaking News

నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •   సర్ పత్రాల సేకరణను పరిశీలించిన మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్   •  

‘మంజీర’లో సంక్రాంతి సంబురాలు

10-01-2026 12:00 AM

రామాయంపేట, జనవరి 9 : రామాయంపేట మంజీర విద్యాలయంలో ముందస్తుగా సంక్రాంతి సంబరాలను సంప్రదాయబద్ధంగా, ఉత్సాహభరితంగా ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల్లో భారతీయ సంస్కృతి, పండుగల వెనుక ఉన్న తాత్త్వికతను అవగాహన కల్పించే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని పాఠశాల యాజమాన్యం ప్రత్యేకంగా నిర్వహించింది. ఈ సందర్భంగా విద్యార్థినులు రంగవల్లుల పోటీల్లో పాల్గొని చక్కని ముగ్గులు వేసి తమ సృజనాత్మకతను ప్రదర్శించారు.

చిన్నారులకు భోగిపళ్ళు పోసి పెద్దలు ఆశీర్వదించగా, భోగిమంటలు వెలిగించి చెడును తొలగించి మేలును ఆహ్వానించే సంప్రదాయాన్ని ప్రతిబింబించారు. పతంగులు ఎగురవేయడం, సంప్రదాయ నృత్యాలతో పాఠశాల ప్రాంగణం పండుగ వాతావరణంతో మారుమోగింది. జయంత్, హరిప్రీత్, నితీష్, ప్రణీత్, కార్తికేయలు హరిదాసులుగా, గంగిరెద్దు వేషధారణలో హాజరై విద్యార్థులను విశేషంగా ఆకట్టుకున్నారు.

కొంతమంది విద్యార్థినులు గోదాదేవి వేషధారణలో చక్కని నృత్యాలు ప్రదర్శించి అందరి ప్రశంసలు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ సురేష్ కుమార్, కరస్పాండెంట్ జితేందర్ రెడ్డి, ఉపాధ్యాయులు వాసవి, మౌనిక, మీనా, శ్రీశైలం, సంధ్య, సుస్మిత, శ్రీనితతో పాటు విద్యార్థినీ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇదే కార్యక్రమంలో భాగంగా జాతీయ యువజన దినోత్సవాన్ని కూడా ఘనంగా నిర్వహించారు.