15 June, 2026 | 3:07 PM

Breaking News

తెలంగాణపై కేంద్రం తీవ్రమైన వివక్ష.. కిషన్ రెడ్డిపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు   •   పెద్దపల్లిలో కాంగ్రెస్ బూత్ లెవెల్ ఏజెంట్ల శిక్షణ తరగతులు   •   తెలంగాణ ఏర్పాటును ఏనాడూ జనసేన వ్యతిరేకించలేదు   •   ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి   •   మొదటి రోజున నూతనంగా చేరిన విద్యార్థులకు ఘనస్వాగతం   •   ప్రభుత్వ విద్యపై భరోసా.. కొడుకును ప్రభుత్వ పాఠశాలలో చేర్పించిన మచ్చుపేట సర్పంచ్   •   కర్కోటక కాంగ్రెస్ ప్రభుత్వం.. బెల్లంపల్లిలో కవిత హల్‌చల్‌   •   తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సబ్ కమిటీ సమావేశం   •   కార్మికుల దీక్షలకు స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ప్రత్యక్ష మద్దతు ఇవ్వాలి   •   యోగ దినచర్యలో భాగం కావాలి: జిల్లా ప్రోగ్రాం అధికారి   •  

న్యాస్ కాబ్ చైర్మన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన సర్పంచ్ గుమ్మడి

18-12-2025 07:45 PM

చొప్పదండి (విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గుండి గ్రామ సర్పంచ్ గుమ్మడి మల్లేశం గురువారం నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ స్టేట్  కోపరేటివ్ బ్యాంక్ ప్రెసిడెంట్ కొండూరి రవీందర్రావును మర్యాదపూర్వకంగా కలిశారు. నూతనంగా గుండి గ్రామ  సర్పంచ్ ఎన్నికైన గుమ్మడి మల్లేశంను  ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేడీసీసీ బ్యాంకులో 41 సంవత్సరాలు అటెండర్ స్థాయి నుంచి మేనేజర్ స్థాయికి ఎదిగి నిరంతర సేవలలు అందించి నిజాయితీ అంకితభావంతో బ్యాంకు అభివృద్ధికి నిజాయితీ విధేయతతో అందరి మన్ననలు గైకొని బ్యాంకు మేనేజర్ గా విరమణ పొందారని తెలిపారు. అదేవిధంగా గ్రామంలో కూడా నిరంతర సేవలు అందించి గ్రామ అభివృద్ధికి తోడ్పడాలని కొనియాడారు. ఆయనతో పాటు బ్యాంకు సీఈవో సత్యనారాయణ, జిఎం బి శ్రీధర్ తదితరులు ఉన్నారు.