08-12-2025 12:00:00 AM
హామీలు, నామినేషన్, విత్ డ్రా కోసం భారీగా ఖర్చు
అప్పుల ఊబిలో యువనేతలు
గెలిచినా, ఓడినా తప్పని రుణభారం
సంగారెడ్డి, డిసెంబర్ 7(విజయక్రాంతి): నామినేషన్ వేయగానే సర్పంచ్ అయిపోరు.. రాజకీయ రణరంగంలోకి దిగగానే సరిపోదు.. తెరవెనక ఎంతో శ్రమించాల్సి ఉం టుంది అనేది నగ్నసత్యం. ముఖ్యంగా సర్పం చ్ ఎన్నికల్లో పరిస్థితులు ఒకప్పటిలా లేవు. ఊరికి ఏదో చేయాలని పోటీ చేసేందుకు వ స్తున్న వారంతా రూ.లక్షల కొద్దీ డబ్బు ఖర్చు చేయాల్సి వస్తోంది. మార్కెట్ లో నగదు చ లామణి తగ్గిపోయింది.
సర్పంచ్ పదవి కో సం బరిలోకి దిగుతున్న వారికి ఇదో సవాల్ గా మారింది. నామినేషన్ వేసినప్పటి నుంచి ఎన్నికలు జరిగి ఫలితాలు వచ్చే వరకు వా రం రోజుల సమయం ఉంది. నిత్యం ప్రచారానికి రూ.వేలల్లో ఖర్చవుతుంది. ఫ్లెక్సీలు, టీవీలు, పేపర్లలో ప్రచారానికి రూ.లక్షల్లో ఖర్చు పెట్టాలి. ఇదీకాక నిత్యం అనుచరులకు మందు, విందు సరేసరి. వీటన్నింటికీ నగదు కావాలి.
అందుకోసం అభ్యర్థులు అప్పుల వే టలో పడ్డారు. ’అప్పు’డే సర్పంచ్ కాగలరు అన్న ఆశయంతో ఖర్చు కోసం వెనకాడకపోవడం గమనార్హం.సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాల్లో ఇప్పటికే పలు గ్రామాలు ఏకగ్రీవమయ్యాయి. ఇంకా రెండో, మూడో విడత ల్లో పలు గ్రా మాలు ఏకగ్రీవానికి మొగ్గుచూపుతున్నాయి. అయితే ఏకగ్రీవాలు అనుకు న్నంత సులువుగా కొలిక్కి రావడం లేదు. దాని వెనక చాలా తతంగం నడుస్తోంది. చి న్నగ్రామాలు, వెయ్యి లోపు ఓట్లు ఉన్న గ్రామాల్లోనే పోటాపోటీగా నామినేషన్లు వే స్తున్నారు. ఇక మూడువేలు.. ఆపై ఓట్లు ఉ న్న గ్రామాల్లో పరిస్థితి హోరాహోరీగా సాగుతోంది.
ఏకగ్రీవమవుతున్న గ్రామాల్లో ముం దు నామినేషన్లు వేసే వారిని, వేసిన వారిని నయానో, భ యానో దారికి తెచ్చుకుంటున్నారు. దీనికి నామినేషన్ వేసిన అభ్యర్థుల కు చాలా ఖర్చు చేస్తున్నారు. ఎంతలేదన్నా.. ఓ మోస్తరు గ్రా మ పంచాయతీల్లో రూ.30 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు భరించాల్సిన పరిస్థితి. ఇంత నగదు కోసం అభ్యర్థు లు అప్పులబాట పడుతున్నారు. తాము సంపాదించుకున్న ఆస్తులు, ఇంట్లో ఆడవాళ్ల నగలు తీసుకుని తాకట్టుపెట్టి మరీ నగదు తె స్తున్నారు. వీటిని తమను నమ్మేలా నామినేషన్ వేసిన వారికి, ఊర్లో పెద్ద మనుషులకు సమర్పిస్తేనే ఉపసంహరణ సజావుగా సాగుతున్నాయి.
ఓడితే గుదిబండే...
అభ్యర్థులు వాస్తవానికి అప్పులు చేసి పోటీ చేస్తున్న వారిలో నూటికి 90 శాతం మంది సాహసం చేస్తున్నారు. రూ.లక్షల్లో ఖ ర్చు పెడుతూ.. డబ్బును నీళ్లలా ఖర్చు చేస్తున్నారు. బరిలో ఉన్న వారు గెలుస్తారన్న గ్యా రెంటీ లేకపోయినా నామినేషన్ వేశాక ఇ వేమీ ఆలోచించే పరిస్థితిలో లేరు. గెలుస్తార న్న నమ్మకంతో ఖర్చు చేసుకుంటూ పోతున్నారు. మరోవైపు ఏకగ్రీవం కోసం ఇప్పటికే రూ.లక్షలు పెట్టినవారు, పెట్టబోతున్న వారికి అప్పుల ముప్పు పొంచి ఉంది.
గెలిచినా, గెలవకపోయినా.. ఖర్చు మాత్రం పెట్టక తప్పని పరిస్థితి, అందుకే, ఈ యువ నాయ కులు త మ డాబు, దర్పం ప్రదర్శించుకోవడానికి భూములు, నగలు తాకట్టు పెట్టి డబ్బు తెచ్చి పంచాయతీ ఎన్నికల్లో ఖర్చు చేస్తున్నారు. గెలిచినా, గెలవకపోయినా రుణం తీర్చడం మాత్రం అనివార్యం. ఈ నేపథ్యంలో వీరం తా ఈ అప్పు లను ఎలా తీరుస్తారో వేచిచూడాల్సిందే.