12 June, 2026 | 1:52 PM

Breaking News

సుప్రీంకోర్టులో మీనాక్షి నటరాజన్‌కు షాక్.. పిటిషన్ డిస్మిస్   •   కూసుమంచి శివాలయంకు పెరిగిన ఆదాయం   •   కూసుమంచి సర్పంచ్ కొండా కృష్ణవేణి-మహిపాల్ లను ఆశీర్వదించిన మంత్రి పొంగులేటి   •   మల్లాపూర్‌లో పందుల బీభత్సం.. చర్యలు తీసుకోవాలని గ్రామస్తుల విజ్ఞప్తి   •   బాలికపై దారుణానికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలి   •   ప్రభుత్వ కళాశాల అడ్డిషన్ల కోసం గడపగడప ప్రచారం   •   సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల అందజేత   •   ఇందిరమ్మ ఇండ్లు ప్రారంభానికి సిద్ధం చేయండి   •   సుప్రీంకోర్టులో మీనాక్షి నటరాజన్ పిటిషన్‌పై విచారణ   •   మీనాక్షి నటరాజన్ కేసులో పిటిషనర్ బండారు శ్రీలత కీలక వ్యాఖ్యలు   •  

అపరిశుభ్రతపై స్పందించిన సర్పంచ్

30-12-2025 04:31 PM

బిచ్కుంద,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా మద్నూర్ గ్రామంలో ఆర్యసమాజ్ సమీపంలో ఉన్న అంగన్వాడి కేంద్రం చుట్టుపక్కల అపరిశుభ్ర వాతావరణం నెలకొనడంతో పాటు, మరుగుదొడ్డి అవసరాల కోసం అనధికారికంగా వినియోగం పెరిగిందని స్థానిక గల్లీ వాసులు తరచుగా ఫిర్యాదు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక సర్పంచ్ ఉషా సంతోష్ మెస్త్రి అంగన్వాడి కేంద్ర పరిసర ప్రాంతాన్ని ప్రత్యక్షంగా పరిశీలించి, తక్షణమే శుభ్రత చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా బురుజు ప్రాంతంలో ప్రజల ప్రాణాలకు ప్రమాదకరంగా ఉన్న సమస్యలపై కూడా స్థానికులు దృష్టికి తీసుకురాగా, ఒక్కొక్కటిగా అన్ని అభివృద్ధి పనులు చేపడతామని సర్పంచ్ హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి సందీప్, సంగయ్యప్ప, హన్మాండ్లు. నాందేవ్ మెస్త్రి తదితరులు పాల్గొన్నారు.