17 April, 2026 | 3:14 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

కాంగ్రెస్‌లోకి క్యూ కడుతున్న సర్పంచులు

27-12-2025 12:00 AM

పార్టీ కండువా కప్పి ఆహ్వానిస్తున్న జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్‌రెడ్డి 

రాజాపూర్, డిసెంబర్ 26: అధికార కాంగ్రెస్ పార్టీలోకి స్వతంత్ర గా గెలిచిన సర్పంచ్లతో పాటు ఇతర పార్టీల మధ్య ద్వారా గెలిచిన సర్పంచ్ల సైతం కాంగ్రెస్ పార్టీలోకి కడుతున్న సందర్భాలు చోటు చేసుకుంటున్నాయి.

శుక్రవారం రాజపూర్ మండల పరిధిలోని మోత్కులకుంట తాండ స్వతంత్ర సర్పంచ్ సభవత్ గీత కృష్ణా నాయక్, నాయిన్ చెరువు తాండ స్వతంత్ర సర్పంచ్ వెంకట్ నాయక్, జడ్చర్ల మండలం ఈర్లపల్లి స్వతంత్ర సర్పంచ్ మేఘావత్ సరిత నారాయణలు ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.

పార్టీలో చేరిన సర్పంచ్లకు ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అందరం ఐక్యమత్యంగా ఉండి అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు ఉన్నారు.