14 June, 2026 | 4:14 PM

Breaking News

ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా ప్రధాన కార్యదర్శికి ఘన సన్మానం   •   ఆసిఫాబాద్ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి   •   ఎమ్మెల్యే.. కలెక్టర్ ల చొరవ.. రెండు నెలల్లో వంతెన పనులు పూర్తి   •   కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిస్తేనే అభివృద్ధి సాధ్యం: మంత్రి బండి సంజయ్ కుమార్   •   సుల్తానాబాద్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా చొప్పరి సుమన్   •   రాష్ట్ర కమిటీలో నైతం కృష్ణారావు చోటు   •   కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎర్రగుంట సర్పంచ్   •   మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ బోనాల పండుగ   •   రేవంత్ రెడ్డి పాలన ఫస్ట్ ఆఫ్ అట్టర్ ఫ్లాప్: కేటీఆర్   •   రక్తదానం చేసిన సాయి కిషోర్ గౌడ్   •  

కాంగ్రెస్‌లోకి క్యూ కడుతున్న సర్పంచులు

27-12-2025 12:00 AM

పార్టీ కండువా కప్పి ఆహ్వానిస్తున్న జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్‌రెడ్డి 

రాజాపూర్, డిసెంబర్ 26: అధికార కాంగ్రెస్ పార్టీలోకి స్వతంత్ర గా గెలిచిన సర్పంచ్లతో పాటు ఇతర పార్టీల మధ్య ద్వారా గెలిచిన సర్పంచ్ల సైతం కాంగ్రెస్ పార్టీలోకి కడుతున్న సందర్భాలు చోటు చేసుకుంటున్నాయి.

శుక్రవారం రాజపూర్ మండల పరిధిలోని మోత్కులకుంట తాండ స్వతంత్ర సర్పంచ్ సభవత్ గీత కృష్ణా నాయక్, నాయిన్ చెరువు తాండ స్వతంత్ర సర్పంచ్ వెంకట్ నాయక్, జడ్చర్ల మండలం ఈర్లపల్లి స్వతంత్ర సర్పంచ్ మేఘావత్ సరిత నారాయణలు ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.

పార్టీలో చేరిన సర్పంచ్లకు ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అందరం ఐక్యమత్యంగా ఉండి అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు ఉన్నారు.