calender_icon.png 6 June, 2025 | 3:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సివిల్స్ ఫలితాల్లో సత్తా

25-04-2025 02:12:18 AM

ఎస్సీ స్టడీ సర్కిల్ కమిషనర్ ఎన్ క్షితిజ

హైదరాబాద్, ఏప్రిల్ 24 (విజయక్రాంతి): ఇటీవల విడుదల చేసిన సివి ల్స్ తుది ఫలితాల్లో తెలంగాణ షెడ్యూ ల్డ్ కులాల స్టడీ సర్కిళ్లల్లో శిక్షణ పొం దిన ఇద్దరు విద్యార్థులు సత్తా చాటారని తెలంగాణ షెడ్యూల్డ్ కులాల స్టడీ సర్కిల్ కమిషనర్ ఎన్ క్షితిజ తెలిపారు. ఈమేరకు గురువారం ఒక ప్రకటనను విడుదల చేశారు. సివిల్స్‌కు ఎంపికైన వారిలో గోకమల్ల ఆంజనేయులు 934 ర్యాంకు, రాంటెంకి సుధాకర్ 949 ర్యాంకు సాధించారని చెప్పారు.