07-07-2025 12:26:27 AM
పాల్గొన్న సేవ్ ఎర్త్ మిషన్ ఇండియా అధ్యక్షుడు సందీప్ చౌదరి
ముషీరాబాద్, జులై 6 (విజయక్రాంతి) : ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న పర్యావరణ ఉద్యమం సేవ్ ఎర్త్ మిషన్ తన గ్లోబల్ విజన్ ప్రచారాన్ని అధికారికంగా ప్రారంభించినట్లు సేవ్ ఎర్త్ మిషన్ ఇండియా అధ్యక్షుడు సందీప్ చౌదరి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ బహుళ దేశాల ప్రచారం లక్షలాది మందిని చెట్లను నాటడం, పర్యావరణ వ్యవస్థలను పునరుద్ధరించడం, నికర సున్నా భవిష్యత్తును నిర్మించడం లక్ష్యంగా పెట్టుకుందన్నారు.