గీతాంజలిలో ఘనంగా సైన్స్ దినోత్సవం
01-03-2026 12:00 AM
ఖమ్మం, ఫిబ్రవరి 28(విజయక్రాంతి): ఖమ్మం పట్టణంలోని శ్రీనివాసనగర్లోని గీతాంజలి పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తొలుత ప్రఖ్యాత శాస్త్రవేత్త సీవీ రామన్ చిత్రపటానికి పాఠశాల కరస్పాండెంట్ టీవీ అప్పారావు, డైరెక్టర్లు టి పద్మ, టి అరుణలు నివాళులర్పించారు.
ఈ సందర్భంగా కరస్పాండెంట్ టీవీ అప్పారావు జాతీయ సైన్స్ దినోత్సవ ప్రాముఖ్యాన్ని వివరించారు. అనంతరం పాఠశాల విద్యార్థ్యులచే సైన్స్ ఎక్స్ఫో ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శనలో పర్యావరణానికి, గ్లోబల్ వార్మింగ్, వాతావరణ కాలుష్యానికి సంబంధించిన ప్రాజెక్ట్లను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.




