26-10-2025 07:25:18 PM
బెల్లంపల్లి (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా తాండూర్ మండలం రేచిని సమీప గ్రామాల నుండి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ఐదు ట్రాక్టర్లను మైనింగ్ సిబ్బంది ఆదివారం సాయంత్రం పట్టుకొని సీజ్ చేశారు. రేపల్లె వాడ సమీపంలోని ఒక ప్రైవేటు జిన్నింగ్ అక్రమంగా ఇసుక తరలిస్తుండగా జిల్లా మైనింగ్ ఏడి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పట్టుకున్నారు. పట్టుకున్న ఇసుక ట్రాక్టర్లను తాండూర్ పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు మైనింగ్ సిబ్బంది సురేష్ తెలిపారు.