08-10-2025 01:01:39 AM
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఎస్జీఎఫ్ అండర్ 19 కబడ్డీ పోటీల్లో
ఎల్లారెడ్డి అక్టోబర్ 7(విజయ క్రాంతి): క్రీడాకారులు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా తరఫున రాష్ట్రస్థాయి పోటీల్లో ఎల్లారెడ్డి గురుకుల పాఠశాల నుండి బి మధు డి సతీష్ రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారనీ, ఫిజికల్ డైరెక్టర్ నిఖిల్ తెలియజేశారు. రాష్ట్రస్థాయి పోటీలు ఈనెల 10-10-2025 నుండి 12-10-2025 వరకు కోములవాంఛ, మహబూబాబాద్ లో జరిగే పోటీల్లో పాల్గొంటారనీ,విద్యార్థులు ఎంపికైనట్టు కళాశాల ప్రిన్సిపల్ నాగేశ్వరరావు తెలియజేశారు. విద్యార్థులు ఎంపికయ్యడంతో కళాశాల ప్రిన్సిపాల్ నాగేశ్వరరావు వైస్ ప్రిన్సిపాల్ శ్రీనివాస్ ఫిజికల్ డైరెక్టర్ నికిల్ వ్యాయామ ఉపాధ్యాయుడు సురేందర్ పాఠశాల కళాశాల ఉపాధ్యాయ బృందం అభినందనలు తెలియజేశారు.